'ఆనందయ్యకు ఆయుష్​ శాఖ నోటీసులు'

author img

By

Published : Jan 12, 2022, 5:00 PM IST

Updated : Jan 12, 2022, 5:24 PM IST

ayush commissioner p.ramulu speaks on anandaiah medicine on omicron

కరోనా మందులు తయారుచేసిన ఆనందయ్యకు.. ఆయుష్‌శాఖ నోటీసులు జారీ చేసింది. మందుల తయారీకి అనుమతి తీసుకోకుండానే.. 48 గంటల్లో కరోనా తగ్గిస్తామంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆయుష్​ శాఖ కమిషనర్​ రాములు తెలిపారు.

కరోనా మందులు తయారుచేసిన ఆనందయ్యకు.. ఆయుష్‌శాఖ నోటీసులు జారీ చేసింది. ఒమిక్రాన్‌కు ఆనందయ్య మందు ఇస్తున్నట్లు తెలిసిందని ఆయుష్‌ కమిషనర్‌ పి. రాములు అన్నారు. మందుల తయారీకి అనుమతి తీసుకోకుండానే.. 48 గంటల్లో కరోనా తగ్గిస్తామంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఒమిక్రాన్‌ పేరిట మందు ఇవ్వకూడదని చెప్పామన్న ఆయన.. ఆనందయ్య వద్ద శాస్త్రీయ ఆధారాలుంటే ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. రోగనిరోధక శక్తి కోసం ఆయుష్ శాఖ వద్ద ఔషధాలు ఉన్నాయని రాములు తెలిపారు.


ఇదీ చదవండి: MP RRR: 'హీరో ఎవరో.. కీచకుడు ఎవరో తేలుద్దాం.. అంతా ఒక్కటై రావణరాజ్యాన్ని అంతం చేద్దాం'

Last Updated :Jan 12, 2022, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.