TIRUMALA: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

author img

By

Published : Oct 14, 2021, 9:42 AM IST

TIRUMALA

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఈ రోజు పలువురు ప్రముఖులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎంపీలు గురుమూర్తి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, తమిళనాడు మంత్రి అంబిల్ మహేష్ , భాజాపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమలకు చేరుకున్న ప్రముఖులకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి: నేటి నుంచి అమల్లోకి రానున్న నదీయాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.