TTD: శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు

author img

By

Published : Sep 16, 2021, 11:40 PM IST

TTD

తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో ప్రవిత్రోత్సవాలను తితిదే ఏకాంతంగా నిర్విహించింది. ప్రత్యేక పూజల అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పవిత్ర ప్రతిష్ఠ చేశారు.


తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. కరోనా నేప‌థ్యంలో ప‌విత్రోత్స‌వాలను ఆల‌య అధికారులు ఏకాంతంగానే నిర్వ‌హించారు.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి, అమ్మ‌వార్ల ఉత్సవమూర్తులకు.. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనాల‌తో అభిషేకం నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం పవిత్ర ప్రతిష్ఠ చేశారు. యాత్రికులు, సిబ్బంది ద్వారా జరిగే దోషాలను నివారించేందుకు ప్రతి ఏటా మూడు రోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:

SVBC: ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.4.2 కోట్ల విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.