ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

author img

By

Published : Sep 14, 2022, 3:34 PM IST

Dhavaleswaram

Dhavaleswaram : ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువున కురుస్తున్న వర్షాలకు బ్యారేజ్​ నీటిమట్టం 14.20 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Floods at Dhavaleswaram : ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద వరద ప్రవాహం భారీగా పెరుగుతుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం నీటిమట్టం 14.20 అడుగులకు చేరగా.. 13.37లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కాల్వలకు 8వేల800 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. జాలర్లు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పలు లంక గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి.

ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.