Pulasa fish 2 కిలోల పులసకు వేలంపాట, ఎంతపలికిందో తెలుసా

author img

By

Published : Aug 24, 2022, 12:03 PM IST

Updated : Aug 24, 2022, 12:51 PM IST

Pulasa fish

గోదావరి నదిలో దొరికే అత్యంత అరుదైన చేప. ఏటికి ఎదురీదుతూ ఏ చేపకూ లేని రుచిని, ప్రత్యేకతనూ సంతరించుకుంది పులస చేప. ఈ చేప దొరికితే చాలు, మత్స్యకారుల పంట పండినట్లే. తూర్పుగోదావరి జిల్లా యానాం మార్కెట్​లో పులసకు భారీ ధర పలుకుతోంది.

గోదావరి వరద ఉధృతి తగ్గడంతో యానాం మార్కెట్లో పులస చేపల విక్రయాలు మొదలయ్యాయి. మంగళవారం ఇక్కడి రేవులో చేపల వేలంపాట నిర్వహించగా 2 కిలోల బరువున్న తాజా పులస చేపను నాటి పార్వతి అనే మహిళ దక్కించుకుని, దాన్ని భైరవపాలెంకు చెందిన వ్యక్తికి రూ.19 వేలకు విక్రయించారు. ఈ సీజన్‌లో ఇదే అధిక ధరని స్థానికులు చెబుతున్నారు. ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ వద్ద ఇసుక మేటల వల్ల సముద్రంలోంచి గౌతమి పాయలోకి పులసలు తక్కువగా వస్తున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 24, 2022, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.