కాలి బూడిదైన రూ.15 లక్షల విలువైన ఫోన్లు!

author img

By

Published : Oct 11, 2021, 2:45 PM IST

మొబైల్ దుకాణంలో అగ్ని ప్రమాదం

నెల్లూరు జిల్లా కేంద్రంలోని లస్సీ సెంటర్‌లో ఓ మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో.. దుకాణంలోని దాదాపు రూ.15 లక్షల విలువైన ఫోన్లు అగ్నికి ఆహుతయ్యాయి.

నెల్లూరు లస్సీ సెంటర్​లో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్​ కారణంగా ఓ మొబైల్ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో రూ.15 లక్షల విలువైన ఫోన్లు కాలి బూడిదయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత ఈ ప్రమాదం సంభవించడంతో.. అరికట్టడానికి అవకాశం లేకపోయింది.

మొబైల్ దుకాణంలో అగ్ని ప్రమాదం

ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, పక్క దుకాణాలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంతో భారీగా ఆస్తినష్టం జరిగిందని దుకాణ యజమాని శ్రీనివాసులు రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.

ఇదీచదవండి.

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేసిన తల్లి.. కారణమేంటంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.