Road Accident: నెల్లూరు-తిరుపతి బస్సు బోల్తా... ఒకరు మృతి, 15 మందికి గాయాలు

author img

By

Published : May 10, 2022, 10:40 AM IST

Road accident

Road accident: నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు బోల్తా పడి వృద్ధురాలు మృతి చెందగా... మరో 15 మందికి గాయాలయ్యాయి.

Road accident: నెల్లూరు జిల్లా మనుబోలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా... ఒకరు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలు నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడుకు చెందిన కరీమాగా పోలీసులు గుర్తించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.