కడప జిల్లాలో వారం రోజుల కిందట సంభవించిన వరదల్లో అనేక మంది గల్లంతయ్యారు. పలువురు మృత్యువాత పడ్డారు. రాజంపేటకు చెందిన శివ ప్రసాద్ అనే వ్యక్తి నందలూరు వద్ద బస్సులో ప్రయాణిస్తూ వరదల్లో(Siva Prasad missed in Kadapa flood) గల్లంతయ్యారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అసిస్టెంట్ మేనేజర్ గా ఆయన పని చేస్తున్నాడు. వారం రోజుల నుంచి శివప్రసాద్ కోసం కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ దొరకలేదు . 3 నెలల గర్భవతి అయిన శివప్రసాద్ భార్య జ్యోతి ఆవేదన వర్ణనాతీతం. శివప్రసాద్ ఇంటి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు..