Lokesh Tour In Guntur : మీకు పార్టీ అండగా ఉంటుంది - లోకేశ్

author img

By

Published : Nov 26, 2021, 7:41 PM IST

Lokesh Tour In Guntur

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Lokesh Tour In Guntur) వరసగా మూడో రోజు పర్యటించారు.

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Lokesh Tour In Guntur) వరసగా మూడో రోజు పర్యటించారు.

మంగళగిరిలో నూతనంగా నిర్మించే అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామి విగ్రహ ప్రతిష్ఠకు భూమి పూజ(Lokesh performed land puja) చేశారు. అనంతరం కరోనాతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు(Lokesh went to homes of family members of activists who died with Corona). వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కరోనా నుంచి కోలుకున్న పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

భారత రాజ్యాంగం అమలు దినోత్సవం(Indian Constitution Day) సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. కూరగాయలు, పండ్లు అమ్ముకునే వారికి లోకేశ్ తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన తోపుడు బండ్లను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. ఏ కష్టం వచ్చినా తనను కలవాలని కార్యకర్తలకు సూచించారు.

ఇదీ చదవండి : Ap Govt Affidavit On Amaravathi: పాలనా వికేంద్రీకణ బిల్లును ఉపసంహరించుకున్నాం.. ప్రభుత్వం అఫిడవిట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.