హత్యకేసు నిందితుడు పరారీ.. నలుగురు పోలీసులు సస్పెన్షన్​

author img

By

Published : Jun 24, 2022, 10:33 AM IST

Updated : Jun 24, 2022, 10:16 PM IST

Accused escaped

Accused escaped: ఏలూరు జిల్లాలో పోలీసుల నిర్లక్ష్యంతో ఓ హత్య కేసు నిందితుడు పరారయ్యాడు. వైకాపా నాయకుడు గంజి ప్రసాద్ హత్య కేసులో నిందితుడు రవితేజ.. ఏలూరు ప్రభుత్వాస్పత్రి నుంచి తప్పించుకున్నాడు. నిందితుడు రవితేజ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులను ఎస్పీ సస్పెండ్​ చేశారు.

Accused escaped: పోలీసులు నిర్లక్ష్యంతో... ఇటీవల జరిగిన ఓ హత్య కేసులోని నిందితుడు పరారైన సంఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో సంచలనం రేకెత్తించిన వైకాపా నాయకుడు గంజి ప్రసాద్ హత్య కేసులో నిందితుడు, రిమాండ్ ఖైదీ రవితేజ జిల్లా కారాగారంలో శిక్షను అనుభవిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా నిందితుడు రవితేజకు అనారోగ్యం కారణంగా జిల్లా కేంద్రంలోని ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడి దగ్గర ఇద్దరు సెంట్రీలు ఉండగా అందులో ఒకరు కనిపించడంలేదు. మరొక సెంట్రీని నిందితుడు రవితేజ మచ్చిక చేసుకొని ఇద్దరు మద్యం సేవించారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రి నుంచి నిందితుడు రవితేజ సెంట్రీని ఏమార్చి ఈరోజు తెల్లవారుజామున తప్పించుకున్నాడు.

మరోవైపు ఈ ఘటనతో ఆసుపత్రిలో సెక్యూరిటీ విభాగం వైఫల్యం కూడా బయటపడింది. రాత్రి 10 గంటల తర్వాత ఆ వార్డు వైపు ఎవరిని అనుమతించరు. అలాగే అటు నుంచి ఎవరూ బయటకు రావటానికి వీలు లేకుండా కాపలా కాస్తుంటారు. కానీ అంత మంది ఉన్నా నిందితుడు రవితేజ తప్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో రవితేజను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.

ఖైదీ పరారీ ఘటనలో ఎస్పీ చర్యలు తీసుకున్నారు. హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్​ చేస్తున్నట్లు ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ప్రకటించారు.

ఇవీ చదవండి:

Last Updated :Jun 24, 2022, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.