మూడు రాజధానులకు మద్దతుగా.. వైకాపా నాయకుల ప్రత్యేక పూజలు

author img

By

Published : Oct 5, 2022, 4:24 PM IST

Updated : Oct 5, 2022, 7:25 PM IST

ysrcp ministers and mla worshiped

YSRCP : ఓ వైపు అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రభంజనంలా సాగుతుంటే.. మరోవైపు 3 రాజధానులకు మద్దతుగా.. అధికార పార్టీ నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటూ.. టెంకాయలు కొట్టారు. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటూ మంత్రులు, వైకాపా నేతలు అంటున్నారు.

YSRCP LEADERS POOJALU : మూడు రాజధానులకు మద్దతుగా.. దసరా సందర్భంగా.. అధికార పార్టీ నేతలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. వికేంద్రీకరణ బిల్లుకు.. న్యాయపరమైన చిక్కులు తొలగిపోవాలంటూ.. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో మంత్రి రోజా 108 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆమదాలవలస పాల పోలమ్మ ఆలయంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో 108 కొబ్బరికాయలు కొట్టారు. మూడు రాజధానులకు ప్రతిపక్షాలు సహకరించాలని సభాపతి కోరారు.

మూడు రాజధానులకు మద్దతుగా.. వైకాపా నాయకుల ప్రత్యేక పూజలు

శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడ‌లిలోని దుర్గామాత ఆలయంలో.. స్థానిక నేతలతో కలసి మంత్రి ధర్మాన ప్రసాదరావు పూజలు చేశారు. విశాఖ పరిపాలన రాజధానికి మద్దతుగా.. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంలో.. వైకాపా నేతలు వెయ్యి టెంకాయలు కొట్టారు. అమరావతి రైతులు.. పాదయాత్ర పేరిట ఉత్తరాంధ్రలో అడుగుపెట్టడం ఎంతవరకు సమంజసమని.. శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ జరగాలంటూ.. సాలూరు శామలాంబ ఆలయంలో.. ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర పూజలు చేశారు.

రాష్ట్రంలో 3 రాజధానులు రావాలంటూ.. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం సొసరాం దుర్గామాత గుడిలో మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పూజలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని.. టెక్కలిలో దుర్గా మండపం వద్ద వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్లెక్సీలతో ప్రదర్శన నిర్వహించారు.

వికేంద్రీకరణ బిల్లుకు భగవంతుని ఆశీస్సులు ఉండాలంటూ.. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో.. వైకాపా నేత బాలనాగిరెడ్డి పూజలు చేశారు. 3 రాజధానులు ఏర్పాటు కావాలని.. ఎంపీలు సంజీవ్ కుమార్, పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, సుధాకర్.. కర్నూలు ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి టెంకాయలు కొట్టారు. ఎన్టీఆర్​ జిల్లా జగ్గయ్యపేటలో.. వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను.. ఫ్లెక్సీలతో ప్రదర్శన నిర్వహించారు. మూడు రాజధానులకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.


ఇవీ చదవండి:

Last Updated :Oct 5, 2022, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.