ప్రధాన వార్తలు @ 9pm

author img

By

Published : Dec 2, 2021, 9:01 PM IST

ప్రధాన వార్తలు @ 9pm

.

  • NGT Penalty On AP Govt: పోలవరంలో ఉల్లంఘనలు.. రాష్ట్రానికి ఎన్‌జీటీ భారీ జరిమానా

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.120కోట్ల జరిమానా విధించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ERC ON TRUE UP CHARGES: విద్యుత్ వినియోగదారులకు ఊరట.. ట్రూ అప్ ఛార్జీలపై కీలక నిర్ణయం

ట్రూ అప్ ఛార్జీల విషయంలో ఏపీ విద్యుత్ నియంత్రణా మండలి కీలక నిర్ణయాన్ని వెలువరించింది. రాష్ట్రంలో విద్యుత్​ వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేసిన ట్రూ అప్ ఛార్జీలను వెనక్కు తిరిగి ఇవ్వాల్సిందిగా ఈఆర్సీ ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఎమ్మెల్సీలుగా 11 మంది వైకాపా అభ్యర్థులు.. ఈసీ నోటిఫికేషన్

AP Local body MLC Election Results: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. వైకాపా తరపున బరిలో నిలిచిన 11 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • TIRUMALA GHAT ROADS WORK: తిరుమల ఘాట్ రోడ్లులో మరమ్మతులు ముమ్మరం..

TIRUMALA GHAT ROADS WORK: తిరుమల ఎగువ ఘాట్ రోడ్డులో విరిగిపడిన బండరాళ్లను తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జేసీబీలు, క్రేన్​ల సాయంతో రాళ్లను తొలగిస్తున్నారు. దెబ్బతిన్న తిరుమల ఎగువ కనుమదారిని ఐఐటీ నిపుణులు పరిశీలించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'బెంగళూరులో రెండు ఒమిక్రాన్‌ కేసులు.. మరో ముగ్గురికి...'

ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కొవిడ్​ కొత్త వేరియంట్​ 'ఒమిక్రాన్'​ భారత్​లోకి ప్రవేశించింది. కర్ణాటక బెంగళూరులోనే రెండు ఒమిక్రాన్​ కేసులు వెలుగుచూసినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 11, 20వ తేదీల్లో బెంగళూరుకు వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు వెల్లడించారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • తుపానుతో కేంద్రం హైఅలర్ట్- మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

ఉత్తర ఆంధ్రా, ఒడిశా మధ్య తుపాను తీరం దాటే అవకాశమున్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అధికారుల భేటీ జరిగింది. ఆయా ప్రాంతాల్లోని ప్రస్తుత పరిస్థితులపై అధికారులు మోదీకి వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 14వ విడత చర్చలకు భారత్​- చైనా సన్నద్ధం

India China Military talks: సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్​-చైనా 14వ దఫా చర్చలకు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్​ ద్వితీయార్థంలో ఈ చర్చలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • భారత్​లో 'ఒమిక్రాన్​' కేసులపై డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరిక!

Omicron variant in India: భారత్​లో రెండు ఒమిక్రాన్​ కేసులు గుర్తించడంపై డబ్ల్యూహెచ్​ఓ స్పందించింది. ఒమిక్రాన్​లో చాలా మ్యుటేషన్లు ఉన్నాయని, అందులో కొన్ని ఆందోళనకరంగా ఉన్నట్లు హెచ్చరించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సందిగ్ధంలో భారత్​-దక్షిణాఫ్రికా సిరీస్​.. కోహ్లీ స్పందన ఇదే!

India team for south africa series: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత్​- దక్షిణాఫ్రికా సిరీస్​పై సందిగ్ధం నెలకొంది. ఇదే విషయమై స్పందించిన కెప్టెన్​ కోహ్లీ.. తనకు కూడా పూర్తి స్పష్టత లేదన్నాడు. డిసెంబరు 17 నుంచి ప్రారంభం అవ్వాల్సిన ఈ సిరీస్​ను​ వారం రోజుల పాటు వాయిదా వేయనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Akhanda review: 'అఖండ' సినిమా.. ఆడియెన్స్​ రియాక్షన్​ ఇదే!

Akhanda movie review: బాలకృష్ణ 'అఖండ' సినిమా థియేటర్లలో విడుదలై దుమ్మురేపుతోంది. థియేటర్​ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు బాలయ్య నటన సహా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.