- కామన్వెల్త్ క్రికెట్ ఫైనల్లో భారత్ మహిళా జట్టు.. పతకం ఖాయం
కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టింది. సెమీఫైనల్లో ఇంగ్లండ్పై అద్భుత విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో పతకం ఖాయం చేసుకుంది. ఫైనల్లో గెలిస్తే పసిడి, ఓడితే రజతం దక్కుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ విజేతతో ఫైనల్లో భారత్ తలపడుతుంది.
- 'కేంద్రం వైఖరి సరిగా లేదు.. నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా..'
TS CM KCR ON NITI AAYOG: ఆదివారం దిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నీతిఆయోగ్తో దేశానికి మంచిరోజులు వస్తాయని ఆశించామన్నారు. కానీ.. నీతిఆయోగ్ ఇప్పుడు నిష్క్రియకపరత్వంగా, నీతి ఆయోగ్ నిరర్థక సంస్థగా మారిందన్నారు. దేశంలో పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
- 'విజయసాయి గారూ.. ఆ విషయాన్ని ఇప్పటికి గుర్తించారా ?'
CPI state secretary Ramakrishna: వైకాపా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని అటకెక్కించిందని రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను నిర్వీర్యం చేయదలచిందన్నారు. రాజధానుల ఏర్పాటు విషయంలో రాష్ట్రానికి అధికారం లేదనే విషయాన్ని ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పటికి గుర్తించారా ? లేక గత మూడేళ్లు నిద్రపోయారా ? అని ఆయన ప్రశ్నించారు.
- 'మీ వ్యక్తిగత విషయాల్లోకి సామాజిక వర్గాలను తీసుకొస్తారా ?'
Kakatiya Seva Samakhya Fire: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తన వ్యక్తిగత విషయంలోకి సామాజిక వర్గాలను తీసుకొచ్చి దూషించడం తగదని కాకతీయ సేవా సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం ఆయన క్షమాపణలు చెప్పకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
- రెండు బైక్లను బలంగా ఢీకొట్టిన స్కార్పియా.. బంపర్లో బైకర్ ఇరుక్కుని..
Horrific Accident: మహారాష్ట్రలోని కార్వే గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొస్తున్న ఓ స్కార్పియో.. రెండు బైక్లను బలంగా ఢీకొట్టింది. దీంతో ఓ బైకర్.. ద్విచక్రవాహనంతో పాటు స్కార్పియో బంపర్ కింద ఇరుక్కుపోయాడు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
- పార్లర్లో యువతిపై గ్యాంగ్రేప్.. మేనేజర్, కస్టమర్ కలిసి..
బ్యూటీపార్లర్లో పనిచేస్తున్న ఓ యువతిపై పార్లర్ మేనేజర్తో పాటు కస్టమర్ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన దిల్లీలో జరిగింది. మరోవైపు, మహారాష్ట్రలో ఓ 35 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి రోడ్డు మీద పడేసి పారిపోయారు.
- టైమ్పాస్ ముచ్చట్లే కాదు.. ఈ ఆన్లైన్ రచ్చబండల్లో ఇంకా ఎన్నో!
Best Social Audio Apps: కాలం మారింది.. రచ్చబండలు ఆన్లైన్లోకి వచ్చేశాయ్.. సోషల్ ఆడియో యాప్స్ పేరుతో రచ్చ చేస్తున్నాయి. వీటి ద్వారా.. ముఖాలు చూసుకోకుండానే కబుర్లు చెప్పుకునే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరుగుతోంది. మరి ఇందులో పాపులర్ యాప్స్ గురించి వివరాలు మీకోసం..
- SBI Results: తగ్గిన ఎస్బీఐ లాభం.. ఆదాయంలోనూ..
SBI Results: 2022-23 తొలి త్రైమాసికంలో ఎస్బీఐ నికర లాభం కాస్త తగ్గింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో రూ. 6,068 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఆదాయం కూడా స్వల్పంగా తగ్గింది.
- అనుష్క పోషించిన ఆ పాత్ర చేయాలని ఉంది: కృతిశెట్టి
Kritishetty Nithin Macharla niyojakavargam: తన డ్రీమ్ రోల్ ఎంటో చెప్పింది యువ హీరోయిన్ కృతిశెట్టి. హీరో నితిన్పై తనకున్న అభిప్రాయాన్ని తెలిపింది. అలానే ఆయనతో కలిసి నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా గురించి పలు విశేషాలను తెలిపింది.