DISHA ENCOUNTER CASE: క్లూస్​ టీం అధికారిపై ప్రశ్నల వర్షం.. సజ్జనార్ విచారణ వాయిదా

author img

By

Published : Oct 5, 2021, 9:21 AM IST

sirpoorkar-commission-questioned-clues-team-officer-venkanna-in-disha-encounter-case-today

దిశ నిందితుల ఎన్​కౌంటర్(DISHA ENCOUNTER CASE)​ కేసులో సిర్పూర్కర్ కమిషన్.. ​క్లూస్ టీం అధికారి వెంకన్నను ప్రశ్నించింది. ఘటనా స్థలంలో గడ్డి ఎక్కువగా ఉండటం వల్ల తూటాలు లభించలేదని ఆయన కమిషన్​కు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ సోమవారం విచారణకు వెళ్లగా.. 7వ తేదీన హాజరు కావాలని కమిషన్ సూచించింది.

దిశ నిందితుల ఎన్​కౌంటర్(DISHA ENCOUNTER CASE) జరిగిన స్థలంలో ఆధారాలు సేకరించిన క్లూస్ టీం అధికారి వెంకన్నపై సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఘటనా స్థలంలో గడ్డి ఎక్కువగా ఉండటం వల్ల తూటాలు లభించలేదని వెంకన్న కమిషన్​కు వివరించారు. ఎన్​కౌంటర్ సమయంలో తుపాకీ వినియోగించారని నిర్ధారించేందుకు తుపాకీ పేలిన అవశేషాలను ఎలా తీశారని కమిషన్ తరఫు న్యాయవాది పరమేశ్వర్ ప్రశ్నించారు.

దూది, డిస్ట్రిలరీ వాటర్ వినియోగించి తుపాకీ పేలిన అవశేషాలు తీశామని వెంకన్న బదులివ్వగా.. ఎన్​హెచ్​ఆర్సీ నిబంధనలు ఎందుకు పాటించలేదని కమిషన్ నిలదీసింది. ఎన్​కౌంటర్ జరిగిన తీరుపై గీసిన రఫ్ స్కెచ్ ను మంగళవారం సమర్పించాలని వెంకన్నను ఆదేశించింది.

అంతకుముందు ప్రత్యక్షసాక్షి అయిన తెలంగాణలోని ఫరూఖ్ నగర్ సహాయ రెవెన్యూ అధికారి రవూఫ్​ను ప్రశ్నించారు. ఎస్సైతో తన కళ్లల్లో ఇసుక కొట్టి ఆయన చేతిలోని తుపాకీని ఆరిఫ్ లాక్కుని పోయినట్లు ఆయన కమిషన్​కు తెలిపారు. కళ్లల్లో మట్టి కొట్టిన తర్వాత ఆరిఫ్ పోలీసులపై కాల్పులు జరిగన ఘటనను నువ్వు ఎలా చూడగలిగావని కమిషన్ ప్రశ్నించింది. అక్కడి అధికారుల హెచ్చరికలు, తూటాల శబ్దం విని కాల్పులు జరిగినట్లు భావించానని వివరణ ఇచ్చారు.

సజ్జనార్ విచారణ వాయిదా​

సిర్పూర్కర్ కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు సజ్జనార్ హైకోర్టు ప్రాంగణంలోని కార్యాలయానికి చేరుకున్నారు. మిగతా సాక్ష్యుల విచారణ ఉండటంతో ఈనెల 7వ తేదీ విచారణకు హాజరుకావాలని కమిషన్ సజ్జనార్​కు సూచించింది.

ఇదీ చూడండి: Disha Encounter: సిర్పుర్కర్ కమిషన్ విచారణ.. హాజరైన సజ్జనార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.