వైకాపా జీవితకాల అధ్యక్ష పదవిపై సజ్జల ఏమన్నారంటే..!

author img

By

Published : Sep 22, 2022, 8:59 PM IST

Updated : Sep 22, 2022, 10:15 PM IST

sajjala

Sajjala react on CEC objection: వైకాపా జీవిత కాల అధ్యక్షుడిగా వైఎస్​ జగన్​ ఎంపిక చెల్లదని.. దీనిపై స్పష్టత ఇవ్వాలని సీఈసీ కోరిన నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. జూలైలో ఆ తీర్మానం చేశామని.. కానీ జగన్​ దానికి ఒప్పుకోలేదని తెలిపారు. అందుకే ఆ తీర్మానం అమల్లోకి రాలేదని... గత ఫిబ్రవరిలో పార్టీలో చేసిన సవరణ ప్రకారం జగన్​ ఐదేళ్లపాటు అధ్యక్షుడిగా ఉంటారని స్పష్టం చేశారు.

Sajjala on YSRCP lifetime president issue: వైకాపా జీవిత కాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్​ను ఎన్నుకుంటూ జులైలో జరిగిన ప్లీనరీలో చేసిన తీర్మానం ఆమోదం పొందలేదని వైకాపా ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జీవిత కాలం పార్టీ అధ్యక్ష పదవిని సీఎం వైఎస్ జగన్ తిరస్కరించారని తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం తెలుపుతూ స్పష్టత ఇవ్వాలని తమను కోరినట్లు తెలిపారు. వైకాపా జీవిత కాల అధ్యక్షుడుగా వైఎస్ జగన్ ఉండాలని జులైలో జరిగిన ప్లీనరీలో తీర్మానం చేపట్టిన మాట వాస్తవమేనన్న ఆయన.. కార్యకర్తల కోరిక మేరకు తీర్మానం చేపట్టినట్లు తెలిపారు. ఆ పదవిని వైఎస్ జగన్ తిరస్కరించినందున తీర్మానం అమల్లోకి రాలేదన్నారు. ప్లీనరీలో తీర్మానం ఆమోదం పొందలేదని, మినిట్స్​లోనూ లేదన్నారు. ఈసీకీ తాము ఏ తీర్మానాన్నీ పంపలేదన్నారు.

జీవిత కాల అధ్యక్ష పదవి విషయమై స్పష్టత ఇవ్వాలని ఈసీ అడిగినందున.. ప్రస్తుతం ఆ తీర్మానం అమల్లో లేదని కేంద్ర ఎన్నికల సంఘానికి చెబుతామన్నారు. గత ఫిబ్రవరిలో పార్టీలో చేసిన సవరణ ప్రకారం వైఎస్ జగనే వైకాపా అధ్యక్షుడుగా ఉన్నారని సజ్జల చెప్పారు. ఐదేళ్ల పాటు అధ్యక్షుడుగా వైఎస్ జగన్ ఉంటారని చెబుతూ అప్పట్లోనే ఈసీకి సమాచారం పంపామన్నారు. వైకాపాలో ఐదేళ్లకోసారి పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.

CEC ON JAGAN : వైకాపా శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ ఎంపిక చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ను ఎన్నుకున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించిన సీఈసీ.. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా తరచూ ఎన్నికలు జరగాలని స్ఫష్టం చేసింది. శాశ్వత అధ్యక్షుడు లేదా శాశ్వత పదవులు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని పేర్కొంది. ఈ వ్యవహారంలో పార్టీకి లేఖలు రాసినా పట్టించుకోలేదని.. వెంటనే అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పార్టీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపింది.

ఇవీ చదవండి:

Last Updated :Sep 22, 2022, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.