Sajjala: ఎంపీపీ ఎన్నికల్లో తెదేపా, జనసేన ఒక్కటయ్యాయి: సజ్జల

author img

By

Published : Sep 24, 2021, 7:13 PM IST

Sajjala

ఏ పార్టీలోనైనా స్థానిక నాయకత్వం కోసం పోటీ సహజమే అని సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy news )అన్నారు. ఎంపీపీ ఎన్నికల్లో వైకాపా గెలవొద్దని జనసేన, తెదేపా ఒక్కటయ్యాయని ఆరోపించారు.

ఎంపీపీ ఎన్నికల్లో(ap parishad elections results) కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయన్నారు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy on parishad elections news). పరిషత్ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏ పార్టీలోనైనా స్థానిక నాయకత్వం కోసం పోటీ సహజమే అని వ్యాఖ్యానించారు. ఎంపీపీ ఎన్నికల్లో వైకాపా గెలవొద్దని జనసేన, తెదేపా ఒక్కటయ్యాయని ఆరోపించారు. ఈ నెల 27న జరిగే భారత్ బంద్‌(bharat bandh news)పై వైకాపా ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మద్దతుపై ముఖ్యమంత్రి(cm jagan )తో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు.

హైదరాబాద్‌లో కూర్చొని ఏపీ గురించి మాట్లాడతారా?

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. హైదారాబాద్‌లో కూర్చొని ఏపీ గురించి మాట్లాడటం.. ఏదైనా జరిగితే తానొస్తానంటూ హడావుడి చేయడమేంటని ప్రశ్నించారు. పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే మిత్రపక్షం భాజపాను ఒప్పించి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపించాలని సూచించారు.

ఇదీ చదవండి

TTD: అక్టోబర్ నెల టికెట్లు.. ఆన్‌లైన్‌లో విడుదల చేసిన తితిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.