JEE MAINS: నేటి నుంచి జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్షలు..

author img

By

Published : Jun 23, 2022, 7:50 AM IST

JEE MAINS

JEE MAINS: మొదటి విడత జేఈఈ మెయిన్​ పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9-12 గంటల వరకు, మధ్యాహ్నం 3-6 గంటల వరకు ఆన్​లైన్​ విధానంలో పరీక్షలు ఉంటాయి.

JEE MAINS: జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు నేడు(23-06) ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి ఈనెల 29వ తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు ఆన్​లైన్ విధానంలో ఉంటాయి.

దేశంలోని 31 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు, 29 జీఎఫ్​టీఐల్లోని సుమారు 40వేల ఇంజినీరింగ్ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకు ద్వారా భర్తీ చేస్తారు. దేశంలోని 23 ఐఐటీల్లోని దాదాపు 13వేల ఇంజినీరింగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్షకు అర్హులను జేఈఈ మెయిన్ ద్వారా ఖరారు చేస్తారు. రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలు జులై 21 నుంచి 30 వరకు జరగనున్నాయి..

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.