APERC CHAIRMAN : నవంబరులో విద్యుత్తు కొత్త టారిఫ్ ప్రతిపాదనలు వస్తాయని, అప్పుడు కూడా ప్రజాభిప్రాయసేకరణ ఆన్లైన్ ద్వారానే చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి వెల్లడించారు. ఏడువేల మెగావాట్ల సౌరవిద్యుత్తు ప్రతిపాదనలకు అంగీకారం తెలిపామని, 24 ఏళ్లుగా ఉన్న హిందూజా టారిఫ్ సమస్యను పరిష్కరించామని చెప్పారు. ఇటీవలే విశాఖలో జరిగిన ఫోరం ఆఫ్ ఈఆర్సీలో కేంద్రం తలపెట్టిన విద్యుత్తు నిబంధనల చట్ట సవరణలు విస్తృతంగా చర్చించామన్నారు. దీనిపై వర్కింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదిక పైనా చర్చ జరిగిందని చెబుతున్న ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ C.V నాగార్జున రెడ్డితో ముఖాముఖి.