ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులకు ముఖకవలికల గుర్తింపు హాజరు విధానం అమలు చేయనున్నారు. ఈ-హాజరుకు సంబంధించిన విధివిధానాలు, యంత్రాల కొనుగోళ్లను ఉన్నత విద్యామండలి పర్యవేక్షించనుంది. విద్యార్థుల హాజరును ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు. వచ్చే జనవరి నుంచి ఈ-హాజరు తప్పని చేయనున్నారు. ప్రస్తుతం విద్యార్థులు తరగతులకు వస్తున్నది? లేనిది? అధికారులకు సక్రమంగా తెలియడం లేదు. కళాశాలలు ఇచ్చే జాబితాపైనే ఆధారపడుతున్నారు. వీటి ఆధారంగానే బోధన రుసుములను చెల్లిస్తున్నారు. ఈ-హాజరు అమలు చేస్తే విద్యార్థి హాజరు నేరుగా ఉన్నత విద్యాశాఖకు చేరుతుంది.
ఇదీ చదవండి: TDP PROTEST: వైకాపా దాడులకు వ్యతిరేకంగా.. పెల్లుబికిన తెదేపా నిరసన