ప్రభుత్వరంగ సంస్థల విద్యుత్తు అవసరాల కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) విధానంలో సౌర విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం ప్రకటించిన పథకాన్ని వ్యవసాయ ఉచిత విద్యుత్తు పథకానికి అనుసంధానం చేసే ప్రతిపాదనపై పునరుత్పాదక ఇంధన వనరులశాఖ (నెడ్క్యాప్) సంప్రదింపులు జరుపుతోంది. వీజీఎఫ్ విధానంలో దేశవ్యాప్తంగా 12వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వశాఖ (ఎంఎన్ఆర్ఈ) భావిస్తోంది. దీని కింద ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు మెగావాట్కు రూ.90 లక్షల వరకు గ్రాంటు అందుతుంది. దీనిపై నెడ్క్యాప్ అధికారులు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. 6,400 మెగావాట్ల సౌర ప్రాజెక్టుల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియను నెడ్క్యాప్ చేపట్టింది.
నిబంధనలు ఇవీ...
* ఈ పథకం కింద యూనిట్ ధర రూ.2.20కి మించకూడదు.
* మెగావాట్కు రూ.70 లక్షలను కేంద్రం గ్రాంటు రూపేణా అందిస్తుంది. సోలార్ పార్కులను ప్రోత్సహించడానికి మెగావాట్కు రూ.20 లక్షల వంతున ఇచ్చే ప్రయోజనమూ అందుతుంది. అంటే మెగావాట్కు రూ.90 లక్షలు కేంద్రం నుంచి గ్రాంటు రూపేణా వస్తుంది.
* కనీసం 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలి. దీన్ని 24 నెలల్లో పూర్తి చేయాలి. అంతకు మించి సామర్థ్యం ఉంటే అదనంగా 6 నెలల గడువు ఇస్తారు.
* 5 వేల మెగావాట్ల ప్రాజెక్టులకు అవసరమైన సౌర విద్యుత్ ఫలకాలను స్థానిక కంపెనీల్లో తయారైన వాటినే వినియోగించాలి.
ఇదీ చదవండి: