Bhogi Mantalu at Mandadam: మందడంలో 'అమరావతి ఉద్యమ సెగలు'... భోగి మంటల్లో జీవో ప్రతులు

author img

By

Published : Jan 14, 2022, 8:57 AM IST

Bhogi Mantalu at Mandadam

Amaravati Udyama Segalu: సంక్రాంతి సందర్భంగా అమరావతి ఐకాస నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. మందడంలో అమరావతి ఉద్యమ సెగలు పేరుతో రైతులు భోగిమంటలు వేశారు.

మందడంలో అమరావతి ఉద్యమ సెగలు భోగి మంటలు

Amaravati Udyama Segalu: సంక్రాంతి సందర్భంగా అమరావతి ఐకాస నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. మందడంలో 'అమరావతి ఉద్యమ సెగలు' పేరుతో రైతులు భోగిమంటలు వేశారు. అమరావతికి వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలను భోగి మంటల్లో వేసి తగులబెట్టారు.

29 గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు భారీగా పాల్గొన్నారు. ప్రజాగాయకుడు రమణ ఆధ్వర్యంలో ఉద్యమ గీతాలను ఆలపించారు. ప్రభుత్వం రైతులపై కక్ష కట్టిందంటూ.. రమణ ఆలపించిన గేయాలకు రైతులు నృత్యాలు చేశారు. తెదేపా నేత శ్రవణ్ రైతులతో కలిసి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

ఇదీ చదవండి :

POLITICAL BHOGI CELEBRATIONS: ప్రతిపక్షాల వినూత్న నిరసన..భోగి మంటల్లో ఆస్తి పన్ను జీవో ప్రతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.