AP TOPNEWS:ప్రధాన వార్తలు@3PM

author img

By

Published : Aug 5, 2022, 3:03 PM IST

AP TOPNEWS

.

  • తెదేపా నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: సీఐడీ ఏడీజీకి వర్ల ఫిర్యాదు..
    తెదేపా నాయకులపై.. సామాజిక మాధ్యమాల్లో వైకాపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న.. విజయసాయిరెడ్డి, దేవేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఐడీ ఏడీజీకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో నిందితులపై చర్యలు తీసుకునేందుకు స్థానిక పోలీసులు ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • సీఎం క్యాంపు కార్యాలయ సమీపంలో.. పోలీస్ టెంటులో మంటలు..
    తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లేమార్గంలో అగ్నిప్రమాదం సంభవించింది. పాత టోల్‌గేట్‌ చెక్‌పోస్టు వద్ద విద్యుత్‌ తీగల నుంచి మంటలు చెలరేగాయి. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఇంటి ముందు రక్తపుమడుగు.. అందులో మృతదేహం!..
    వైఎస్సార్‌ కడప జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది. రక్తపు మడుగులో పడిఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంతకీ ఏం జరిగింది?.పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • Impact on electricity consumers: విద్యుత్‌ వినియోగదారులపై సర్దుబాటు భారం..
    విద్యుత్‌ వినియోగదారులపై సర్దుబాటు భారం పెరిగింది. ప్రతి కనెక్షన్‌ కింద 2014 నుంచి 2019 వరకు వినియోగించిన మొత్తం విద్యుత్‌ను లెక్కించిన డిస్కంలు.. దాని ఆధారంగా నెలకు వాడిన సగటు యూనిట్లను లెక్క తేల్చాయి. 2022 జులై బిల్లులో ట్రూఅప్‌ కింద చూపిన మొత్తం ఎలాంటి మార్పు లేకుండా 36 నెలలపాటు చెల్లించాలి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఆడపిల్ల పుట్టిందని అమానుషం.. సజీవంగా పొలంలో ఖననం.. రక్షించిన రైతు..
    నవజాత శిశువును భూమిలో పాతిపెట్టేశారు ఆమె తల్లిదండ్రులు. ఈ దారుణం గుజరాత్​లో జరిగింది. శిశువును ఓ రైతు రక్షించాడు. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • కాంగ్రెస్​ నిరసనల్లో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక..
    కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలు పలుచోట్ల ఉద్రిక్తంగా మారాయి. దిల్లీలో పాదయాత్రగా రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీలను.. విజయ్ చౌక్​ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్, ప్రియాంక సహా ఇతర నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • రకుల్, మలైకా అందాల విందు.. ఈ ఫొటోస్​ చూస్తే.....
    రకుల్​ప్రీత్​ సింగ్​, మలైకా అరోరా.. అదిరిపోయే డ్రెస్సుల్లో సూపర్​ పోజులు ఇచ్చి సోషల్​మీడియాలో కుర్రాళ్లకు హీట్​ పెంచారు. వారి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసేద్దాం... పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • సుధీర్‌ గోల్డ్‌ 'లిఫ్ట్'.. వీడియో చూశారా?..
    పారా వెయిట్‌లిఫ్టర్ సుధీర్‌ తొలిసారి కామన్వెల్త్‌ హెవీ వెయిట్‌లిఫ్టింగ్‌ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే ఇప్పుడా ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సుధీర్‌ ఫీట్‌ను మీరూ చూసేయండి.. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • వడ్డీ రేట్లు పెంచిన ఆర్​బీఐ.. మీ EMI ఎంత పెరుగుతుందంటే...
    ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం ఆర్​బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ క్రమంలో రెపో రేటు ఆధారిత రుణాల రేట్లన్నీ సహజంగానే పెరుగుతాయి. గృహరుణం తీసుకుని, సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వారు దీన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పటికే రుణం తీసుకున్న వారికీ వడ్డీ రేటు పెరిగినా, నెలవారీ చెల్లించాల్సిన వాయిదాలో మార్పు ఉండదు. రుణం చెల్లించాల్సిన వ్యవధి పెరుగుతుంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • చైనాపై పెలోసీ 'తైవాన్​ పంచ్​'.. ఆంక్షలతో షాక్ ఇచ్చిన డ్రాగన్ దేశం..
    చైనా హెచ్చరికలు పట్టించుకోకుండా విజయవంతంగా తైవాన్ పర్యటన పూర్తి చేశారు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ. తాజాగా ఆమె డ్రాగన్​కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అమెరికా అధికారులను తైవాన్​కు వెళ్లకుండా చైనా అడ్డుకోలేదని అన్నారు పెలోసి. తైవాన్​ను ఏకాకి చేస్తానంటే తాము ఊరుకోబోమన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే.. పెలోసీపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది చైనా. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.