ప్రధానవార్తలు @11AM

author img

By

Published : Aug 5, 2022, 11:00 AM IST

11AM TOP NEWS

..

  • విద్యుత్‌ వినియోగదారులపై సర్దుబాటు భారం

విద్యుత్‌ వినియోగదారులపై సర్దుబాటు భారం పెరిగింది. ప్రతి కనెక్షన్‌ కింద 2014 నుంచి 2019 వరకు వినియోగించిన మొత్తం విద్యుత్‌ను లెక్కించిన డిస్కంలు.. దాని ఆధారంగా నెలకు వాడిన సగటు యూనిట్లను లెక్క తేల్చాయి. 2022 జులై బిల్లులో ట్రూఅప్‌ కింద చూపిన మొత్తం ఎలాంటి మార్పు లేకుండా 36 నెలలపాటు చెల్లించాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్రంలో అదానీకి.. జాతీయ రహదారి ప్యాకేజీలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీఓటీ (నిర్మించు-నిర్వహించు-బదిలీ) పద్ధతిలో రెండు జాతీయ రహదారి ప్యాకేజీలను నిర్వహిస్తున్న స్వర్ణ టోల్‌వే ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌టీపీఎల్‌)ను, అదానీ గ్రూపు సంస్థ అయిన అదానీ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (ఏఆర్‌టీఎల్‌) సొంతం చేసుకోనుంది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. స్వర్ణ టోల్‌వే ప్రైవేట్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • లారీ బీభత్సం... ఇద్దరు మహిళలు మృతి.. ఎక్కడంటే..?

అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాలువపల్లి వద్ద లారీ బీభత్సం సృష్టించింది. ఘోరంగా ఇద్దరి ప్రాణాలు బలిగొంది. పెన్నా నది వంతెన పై నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మిదేవి(46), సరస్వతి(45)గా అనే మహిళలపైకి లారీ దూసుకెళ్లడంతో ఇద్దరి అక్కడికక్కడే మృతిచెందారు. శరీర భాగాలు గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మూడేళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి?.. ప్రశ్నించిన యువకుడిపై ఎమ్మెల్యే కేసు

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో నిర్వహించిన గడపగడపకూ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేపనపల్లె గ్రామంలో ఎమ్మెల్యే ఎంఎస్​ బాబు పర్యటిస్తున్న సమయంలో.. ఒక యువకుడు తమ గ్రామానికి ఏమి చేశారని ప్రశ్నించాడు. విద్యాదీవెన కూడా సక్రమంగా రావడం లేదని ఎమ్మెల్యేను నిలదీశాడు. అక్కడే ఉన్న పోలీసులు యువకుడి అదుపులోకి తీసుకోవడంతో.....గ్రామస్తులు అడ్డుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'దేశంలో ఆ ఇద్దరి 'నియంత' పాలన.. ప్రశ్నిస్తే దాడులే!'

ఎన్​డీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతోందని అన్నారు. ఇద్దరు-ముగ్గురు బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం ఇద్దరు కలిసి దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు రాహుల్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు.. జపాన్​లో 2 లక్షలకు పైనే!

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం మధ్య 20,551 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 5.14 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్​ నుంచి 21,595 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.31శాతంగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నైట్​ క్లబ్​లో అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి

థాయ్​లాండ్​లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 40 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. తూర్పు థాయ్​లోని చోన్​బురి ప్రావిన్స్​లోని సత్తాహిప్ జిల్లా సమీపంలో గల మౌంటెన్ బి నైట్​ క్లబ్​లో గురువారం ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో విదేశీయులు లేరని స్థానిక మీడియా తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వేతన జీవులపై మరో పిడుగు.. వడ్డీ రేట్లు పెంపు.. ఈఎంఐలు మరింత భారం

రుణగ్రహీతలపై మరో పిడుగు పడింది. అందరూ ఊహించినట్లే వడ్డీ రేట్లను మరోసారి పెంచింది రిజర్వ్ బ్యాంక్. అంతకంతకూ విజృంభిస్తున్న ధరల భూతానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. రెపో రేటును ఆర్​బీఐ పెంచడం వరుసగా ఇది మూడోసారి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కామన్వెల్త్​లో భారత్ జోరు.. గోల్డ్​ కొట్టిన సుధీర్

కామన్వెల్త్ క్రీడల్లో భారత్​ను మరో పసిడి వరించింది. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్​లో సుధీర్ స్వర్ణం సాధించాడు. హైజంప్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్యం గెలిస్తే.. లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్‌ రజతం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్‌ క్రీడల పురుషుల లాంగ్‌జంప్‌లో భారత్‌కు లభించిన తొలి పతకం ఇదే. మరోవైపు భారత బాక్సర్ల పతక పంచ్‌లు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'బింబిసార' - 'సీతారామం' ప్రీమియర్​ కలెక్షన్స్​ ఎంతంటే?

వేసవి సినిమాల సందడి తర్వాత జులై నెల పూర్తిగా నిరాశపరిచింది. గత నెలలో విడుదలైన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుడిని పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో ఆశలన్నీ ఆగస్టుపైనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆగస్టు మొదటి వారంలో(నేడు) ప్రేక్షకులు ముందుకు వచ్చిన కల్యాణ్​రామ్​ 'బింబిసార', దుల్కర్​ సల్మాన్​ 'సీతారామం' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రీమియర్​ షోలకు మంచి రెస్పాన్స్​ వచ్చింది. రెండు కూడా పాజిటివ్​ టాక్​ తెచ్చుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.