- ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు.. వర్షం కారణంగా తెప్పోత్సవం రద్దు
DUSSEHRA CELEBRATIONS : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఉత్సవాల చివరిరోజున అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. యాగశాలలో పూర్ణాహుతితో అమ్మవారి ఉత్సవాలు.. పరిసమాప్తమయ్యాయి. వర్షం కారణంగా కృష్ణానదిలో జరగాల్సిన దుర్గమల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం రద్దైంది.
- రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు.. వంశధార కాలువకు గండి
AP WEATHER UPDATES : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత తగ్గిందని.. వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే కోస్తాంధ్ర మీదుగా పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ పలుచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వంశధార కాలువకు గండి పడింది. వరహాల గెడ్డలో ఇద్దరు గల్లంతయ్యారు.
- Farmers: అమరావతి రైతుల మహా పాదయాత్ర.. బ్రహ్మరథం పడుతున్న జనం
Amaravati Farmers: గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న అమరావతి రైతులు పాదయాత్ర 24వ రోజుకు చేరుకుంది. పాదయాత్రలో రైతులకు అడుగడుగున స్థానికుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. రైతులకు మద్దతు తెలపడానికి చిన్న,పెద్ద, ముసలి ముతక అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు.
- మూడు రాజధానులకు మద్దతుగా.. వైకాపా నాయకుల ప్రత్యేక పూజలు
YSRCP : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు మూడు రాజధానులకు మద్దతుగా పూజలు చేశారు. మూడు రాజధానులకు ప్రజలు మద్దతు తెలపాలని పలువురు నాయకులు ప్రజలను కోరారు.
- 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్రేప్.. ట్యూషన్ నుంచి వస్తుండగా ఎత్తుకెళ్లి..
దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఓ 13 ఏళ్ల చిన్నారి ట్యూషన్ నుంచి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆమెను నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
- అంబానీ కుటుంబానికి మరో బెదిరింపు కాల్.. ఫ్యామిలీ మెంబర్ల పేర్లు చెప్పి మరీ..
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి ఓ ఆగంతుకుడు కాల్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంబానీ కుటుంబానికి చెందిన కొంతమంది సభ్యుల పేర్లతో బెదిరింపులకు పాల్పడ్డాడని ముంబయి పోలీసులు తెలిపారు.
- అమెరికాపై రష్యా గుర్రు.. రెచ్చగొట్టొద్దని హెచ్చరిక.. ప్రత్యక్ష యుద్ధ ప్రమాదం!
ఉక్రెయిన్కు మరిన్ని అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయంపై రష్యా మండిపడింది. పశ్చిమదేశాలు-రష్యా మధ్య ప్రత్యక్ష యుద్ధ ప్రమాదాన్ని ఇది పెంచిందని హెచ్చరించింది. అత్యంత తీవ్ర పరిణామాలకు దారి తీసే రెచ్చగొట్టే చర్యలను అమెరికా మానుకోవాలని హితవు పలికింది. అమెరికా తీసుకున్న నిర్ణయం సుదీర్ఘ రక్తపాతం, కొత్త మరణాలకు దారి తీస్తుందని తెలిపింది.
- మీ పెట్టుబడికి ఇన్సూరెన్స్ కావాలా? 'యులిప్'ను ఎంచుకోండి!
దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు ఈక్విటీలో పెట్టుబడి ఒక మార్గం. మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పుడు చాలామంది వీటిని ఎంచుకునేందుకు పెద్దగా ఇష్టపడరు. మార్కెట్లోకి ప్రవేశించడానికి సరైన సమయం అంటూ ఏమీ ఉండదు. పెట్టుబడుల్లో క్రమశిక్షణ, దీర్ఘకాలం కొనసాగడమే ఇక్కడ లాభాలను ఆర్జించేందుకు మార్గం. దీనికి ఉపయోగపడే అనేక పెట్టుబడి పథకాల్లో యూనిట్ ఆధారిత బీమా పాలసీలనూ (యులిప్) ఒకటిగా చెప్పుకోవచ్చు. బీమా రక్షణతోపాటు, మదుపు చేసే వీలూ ఉండాలని భావించే వారికి ఇవి సరిపోతాయి.
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో నిలిచే జట్లు ఇవేనా?
ICC t20 World Cup 2022 : 2022 టీ20 ప్రపంచకప్ ఫైనల్ రేసులో ఆ మూడు జట్లు నిలుస్తాయని ఆసీస్ మాజీ ఆటగాడు మైఖేల్ బెవన్ తెలిపాడు. ఆ మూడు జట్లు ఏవంటే?
- నటి శ్రీలీల తల్లిపై పోలీస్ కేసు నమోదు.. ఫిర్యాదు చేసింది ఆయనే
పెళ్లి సందిడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి శ్రీలీల తల్లిపై పోలీస్ కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. అసలు ఏమైందంటే?