- సీఐడీ పోలీసుల తీరుపై వర్ల రామయ్య ఆగ్రహం.. డీజీపీకి లేఖ|
TDP VARLA LETTER : చింతకాయల విజయ్ వ్యవహారంలో సీఐడీ పోలీసుల తీరుపై తెదేపా నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డికి లేఖ రాశారు. విజయ్ ఇంట్లో ప్రవర్తించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని.. సీఐడీ పోలీసులు బ్యాడ్జీలు ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు.
- మునుగోడు ఉపఎన్నికకు మోగిన నగారా.. తక్షణమే అమల్లోకి ఎన్నికల నియమావళి
Munugode By poll Schedule: తెలంగాణలో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికకు నగారా మోగింది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపఎన్నిక షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. మునుగోడులో నవంబర్ 3న ఉపఎన్నిక పోలింగ్ నిర్వహించి.. 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉపఎన్నికకు ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది.
- భార్యను మోసుకుంటూ తిరుమల మెట్లెక్కిన భర్త.. వీడియో వైరల్
ఆ దంపతులకు 24 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిల్లు చేశారు. తాజాగా వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లారు. కాలినడకన స్వామి దర్శనానికి బయలుదేరారు. కొద్దిసేపటికి భర్త వేగాన్ని భార్య అందుకోలేక పోయింది. దాంతో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ పందేనికి దారి తీసి.. భార్యను భుజాలపై ఎత్తుకుని దాదాపు 70 మెట్లు ఎక్కేశాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
- పల్నాడులో బాలుడి కిడ్నాప్ కలకలం .. కాపాడిన పోలీసులు
POLICE SOLVED KIDNAP CASE : పల్నాడు జిల్లాలో కిడ్నాప్నకు గురైన బాలుడు రాజీవ్ సాయి కథ సుఖాంతమైంది. బాలుడు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
- దుర్గా మండపంలో అగ్నిప్రమాదం- ఐదుగురు మృతి
దసరా నవరాత్రి వేడుకల్లో విషాదం నెలకొంది. ఉత్తర్ప్రదేశ్ భదోహిలో దుర్గమ్మ మండపంలో అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కాగా మిగిలిన ఇద్దరు మహిళలు.
- వాయుసేనకు సరికొత్త అస్త్రం.. కన్ఫ్యూజ్ చేస్తూ శత్రువుకు దెబ్బ!
Light combat helicopter induction : స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లు (ఎల్సీహెచ్) సోమవారం లాంఛనంగా భారత వైమానిక దళంలో చేరాయి. అనేక రకాల క్షిపణులు, ఇతర ఆయుధాలను ప్రయోగించగల ఈ లోహవిహంగాల రాకతో మన వాయుసేన సత్తా మరింత ఇనుమడించనుంది.
- గాల్లో ఉన్న విమానానికి బాంబు బెదిరింపు.. రంగంలోకి వాయుసేన.. టెన్షన్ టెన్షన్!
ఇరాన్కు చెందిన ఓ పాసింజర్ విమానంలో బాంబు ఉందన్న హెచ్చరిక.. కలకలం రేపింది. ప్రయాణికులతో చైనా వెళ్తున్న ఈ విమానం భారత గగనతలంలో ఉండగా ఈ సమాచారం అందింది. వెంటనే భారత వాయుసేన రంగంలోకి దిగింది. వాయుసేన ఫైటర్ జెట్లు.. ఆ పాసింజర్ విమానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం ఆ విమానం చైనా దిశగా సాగుతోంది.
- పెన్షన్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలా? ఇలా అయితే ఈజీ!
Pension life certificate online : పెన్షన్ కోసం లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన సమయం వచ్చింది. డిజిటలీకరణకో ఇప్పుడు ఈ పని చాలా సులువుగా పూర్తి చేయొచ్చు. అదెలాగో తెలుసుకోండి.
- Rohith: ఆ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా రికార్డ్.. గాయంతోనే ఆడి..
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. అయినా పెయిన్ కిల్లర్స్ వేసుకుని అలానే ఆడాడు. ప్రస్తుతం అతడి గాయం తీవ్రతపై స్పష్టత లేదు. ఇక మ్యాచ్ అయిపోయాక డెత్ ఓవర్ల సమస్యతో పాటు పలు విషయాల గురించి మాట్లాడాడు. ఈ మ్యాచ్తో ఓ సూపర్ రికార్డును కూడా సాధించాడు. ఏమన్నాడంటే..
- Adipurush: హనుమంతుడిగా నటించింది ఎవరో తెలుసా?
ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. అయితే ఈ టీజర్లో హనుమంతుడిగా కనిపించిన నటుడు ఎవరా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే?