- తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు.. సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయ ప్రదానం
BRAHMOTSAVALU : వైకుంఠనాథుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వారు సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. సూర్యప్రభ వాహన సేవను దర్శించుకుంటే ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.
- పల్నాడులో బాలుడి కిడ్నాప్ కలకలం .. కాపాడిన పోలీసులు
POLICE SOLVED KIDNAP CASE : పల్నాడు జిల్లాలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కథను పోలీసులు చేధించారు. నెల్లూరు జిల్లా కావలి వద్ద బాలుడిని పోలీసులు గుర్తించి చిలకలూరిపేటకు తీసుకొస్తున్నారు.
- 22వ రోజున అమరావతి రైతుల మహాపాదయాత్ర.. పాల్గొన్న మహిళలు, రైతులు
PADAYATRA : ఒకటే నినాదం.. ఒకటే సంకల్పంతో మొదలుపెట్టిన అమరావతి రైతుల రెండో విడత మహాపాదయాత్ర 22వ రోజుకి చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.
- అమరావతిలో కొనసాగుతున్న రహదారుల విధ్వంసం.. కనీసం పట్టించుకొని అధికారులు
Excavation of roads : రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం కొనసాగుతోంది. అక్రమార్కులు రోడ్లను తవ్వి.. మట్టి, గ్రావెల్, కంకర, ఇసుకను తరలించుకుపోతున్నారు. తాజాగా మందడం, కురగల్లు మధ్యలో గత ప్రభుత్వం నిర్మించిన రహదారిని దుండగులు ధ్వంసం చేశారు. ఈ రోడ్డు సచివాలయానికి కిలోమీటరు దూరంలో ఉన్నా.. బరి తెగించి ప్రజాధనాన్ని దోచుకెళ్లారు.
- దుర్గా మండపంలో అగ్నిప్రమాదం- ఐదుగురు మృతి
దసరా నవరాత్రి వేడుకల్లో విషాదం నెలకొంది. ఉత్తర్ప్రదేశ్ భదోహిలో దుర్గమ్మ మండపంలో అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కాగా మిగిలిన ఇద్దరు మహిళలు.
- గాంధీని తలపించేలా 'అసుర' రూపం.. హిందూ మహాసభ దుర్గా మండపంపై దుమారం
అఖిల భారతీయ హిందూ మహాసభ కోల్కతాలో ఏర్పాటు చేసిన దుర్గా మండపం వివాదాస్పదమైంది. దుర్గమ్మ పాదాల కింద ఉండే అసురుడి(రాక్షసుడి) రూపం మహాత్మా గాంధీని తలపించడం దుమారం రేపింది.
- పాదయాత్ర తొలిరోజే PKకు షాక్.. జనం రాక గ్రౌండ్ మొత్తం ఖాళీ!
సరికొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యమంటూ 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందానికి తొలిరోజే షాక్ తగిలింది. యాత్ర మొదటిరోజైన ఆదివారం పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది.
- పెన్షన్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలా? ఇలా అయితే ఈజీ!
Pension life certificate online : పెన్షన్ కోసం లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన సమయం వచ్చింది. డిజిటలీకరణకో ఇప్పుడు ఈ పని చాలా సులువుగా పూర్తి చేయొచ్చు. అదెలాగో తెలుసుకోండి.
- Rohith: ఆ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా రికార్డ్.. గాయంతోనే ఆడి..
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. అయినా పెయిన్ కిల్లర్స్ వేసుకుని అలానే ఆడాడు. ప్రస్తుతం అతడి గాయం తీవ్రతపై స్పష్టత లేదు. ఇక మ్యాచ్ అయిపోయాక డెత్ ఓవర్ల సమస్యతో పాటు పలు విషయాల గురించి మాట్లాడాడు. ఈ మ్యాచ్తో ఓ సూపర్ రికార్డును కూడా సాధించాడు. ఏమన్నాడంటే..
- PonniyanSelvan: ఈ బ్యూటీ.. ఆ సినిమా చైల్డ్ ఆర్టిస్టా?
పొన్నియిన్ సెల్వన్ నటించిన ఓ అమ్మాయి ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ చిన్నారి ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. తన గురించే ఈ స్టోరీ.