Repeal three capital laws: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 3 రాజధానుల చట్టం ఉపసంహరణ

author img

By

Published : Nov 22, 2021, 7:53 PM IST

3 రాజధానుల చట్టం రద్దు

3 రాజధానుల చట్టాన్ని(ap govt Repeal three capital laws) ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రద్దు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపినట్లు పీటీఐ వెల్లడించిన కథనంలో పేర్కొంది.

మూడు రాజధానుల విషయం(ap Three Capitals Act)పై రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. 3 రాజధానుల చట్టాన్ని (ap govt repeal three capital laws) వెనక్కు తీసుకుంటూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి పాలన వికేంద్రీకరణ చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఇందుకు సంబంధించిన రద్దు బిల్లును ఆమోదించినట్లు పీటీఐ వార్త సంస్థ కథనం వెల్లడించింది.

మెరుగైన బిల్లు తెస్తాం: సీఎం జగన్

వికేంద్రీకరణకు మరింత మెరుగైన బిల్లు తెస్తామని ముఖ్యమంత్రి జగన్(cm jagan on repeal three capital laws) శాసనసభలో స్పష్టం చేసినట్లు పీటీఐ వార్త సంస్థ పేర్కొంది. 2020 నాటి చట్టం స్థానంలో కొత్త బిల్లు తెస్తామని.. విస్తృత ప్రజాప్రయోజనాల కోసమే ఈ నిర్ణయమని సీఎం ప్రకటించారు. వికేంద్రీకరణపై అనేక అపోహలు, అనుమానాలు వచ్చాయని వెల్లడించిన ముఖ్యమంత్రి.. వికేంద్రీకరణపై న్యాయపరమైన వివాదాలు వచ్చాయన్నారు. చట్టాన్ని మరింత మెరుగ్గా తెచ్చేందుకే ఈ నిర్ణయమని తెలిపిన ముఖ్యమంత్రి.. వికేంద్రీకరణే తమ ప్రభుత్వ అసలైన ఉద్దేశమని సీఎం తెలిపినట్లు పీటీఐ వెల్లడించింది.

హైకోర్టులో విచారణ.. వెనక్కి తీసుకుంటున్నట్లు ఏజీ వెల్లడి

రాజధాని వ్యాజ్యాల(ap high court on amaravathi cases)పై ఆరో రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎమ్. సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ కొనసాగించింది. పిటిషనర్ తరఫు న్యాయవాదులు అభిప్రాయాలు చెబుతున్న సమయంలో... అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం ప్రభుత్వ వైఖరిని ధర్మాసనానికి తెలియజేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ చట్టం, సీఆర్డీఏ రద్దు చట్టాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంటున్నట్లు కోర్టుకు నివేదించారు. రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించారని.. శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని వివరించారు. ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం రిపీల్‌ బిల్లును ధర్మాసనం ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఈమేరకు విచారణను మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు ధర్మాసనం వాయిదా వేసింది. హైకోర్టులో తిరిగి విచారణ ప్రారంభమైనా.. అప్పటికీ రిపీల్‌ బిల్లులపై శాసనసభలో ప్రభుత్వం ప్రకటన చేయలేదు. అందువల్ల వివరాల సమర్పణకు కొంత సమయం కావాలని ఏజీ కోరారు. శుక్రవారంలోగా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి(minister peddireddy on 3 capitals law withdraw) స్పందించారు. చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్‌ మాత్రమే.. శుభం కార్డుకు మరింత సమయం ఉందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశామని.. చట్టం ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ(AP ministers on repeals of ap 3 capitals act) కాదన్నారు. నేను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నా అని మంత్రి ఉద్ఘాటించారు. ప్రజల్లో చిన్న చిన్న అపోహలు, న్యాయపరమైన చిక్కులు తొలగించి వికేంద్రీకరణ బిల్లును మళ్లీ తీసుకువస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అందుకే ప్రస్తుత చట్టాన్ని వెనక్కి తీసుకున్నట్లు (three capital repeal bill news) చెప్పారు. అమరావతి రైతుల మనసులో ఉన్నవన్నీ చేయాలంటే కుదరదన్న మంత్రి బొత్స..రాజధాని విషయంలో భాజపాది రెండు నాలుకల ధోరణి అని విమర్శించారు. అమరావతిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఉందని..కానీ ప్రతిపక్షాలు చేయనీయకుండా అడ్డుకున్నాయని విమర్శించారు. వికేంద్రీకరణ చట్టం రద్దు బిల్లుపై ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో స్పష్టమైన ప్రకటన చేశారన్నారు. ఎలాంటి చిక్కులు, ఇబ్బందులు రాకుండా మళ్ళీ బిల్లును తీసుకువస్తామన్నారు.

జగన్ వైఖరితో తీవ్ర నష్టం: చంద్రబాబు

రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ వైఖరి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెదేపా అధినేత చంద్రబాబు (chandrababu on three capitals) అన్నారు. రాజధానిపై సీఎం వైఖరి వల్ల ఉపాధి అవకాశాలు తగ్గటంతో పాటు రాష్ట్ర ఆదాయానికీ భారీగా గండి పడుతోందన్నారు. మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై ప్రభుత్వ నిర్ణయాన్ని భాజపా సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna On Repeals Three Capitals Act) స్వాగతించారు. మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన అవగాహనారాహిత్యం, అహంకారంతో తీసుకున్న నిర్ణయమన్నారు. దాన్ని తాము మెుదటి నుంచి వ్యతిరేకిస్తున్నే ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు(cpi-ramakrishna comments three capital act). అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గత 705 రోజులుగా నిర్విరామంగా సాగుతున్న పోరాటానికి ఇది తొలి విజయంగా ఆయన పేర్కొన్నారు. అమరావతి రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

స్వాగతించిన అమరావతి ఐకాస..

3 రాజధానులపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అమరావతి ఐకాస(amaravati jac on three capitals) తెలిపింది. ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని చెప్పింది. ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని ఐకాస నేతలు తెలిపారు. ఇన్నాళ్లూ అమరావతిని విమర్శించినవాళ్లు క్షమాపణ చెప్పాలన్నారు. మహాపాదయాత్ర కొనసాగుతుందని... ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించేవరకూ తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

High court on three capitals cases: 3 రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.