AMARAVATI INCIDENTS: అమరావతి బిల్లు నుంచి 3 రాజధానుల ఉపసంహరణ వరకు.. అసలేంజరిగిందంటే ?

author img

By

Published : Nov 23, 2021, 1:52 PM IST

Updated : Nov 23, 2021, 2:59 PM IST

Timeline of Amaravati from 2014-2021

రాష్ట్ర విభజన సమయం నుంచి నిన్న ప్రభుత్వం మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకోవడం వరకు (AMARAVATI INCIDENTS time line) జరిగిన పరిణామాల వివరాలు తెలుసుకుందాం..

AMARAVATI TIMELINE: 2014 బిల్లు నుంచి 2021 బిల్లు దాకా.. జరిగిందిది..

  • 2014 జూన్ 2- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజించబడింది.
  • 2014 జూన్ 8- నారా చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు.
  • 2014 సెప్టెంబర్ 3- రాజధాని ప్రాంతాన్ని నిర్ణయిస్తూ శాసనసభ తీర్మానం.
  • 2014 డిసెంబర్ 23- ఏపీసీఆర్డీఏ చట్టాన్ని ఆమోదించిన శాసనసభ.
  • 2014 డిసెంబర్ 31- 122 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధానిని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది.
  • 2014 - సీఆర్డీఏ చట్టం అమలులోకి వచ్చింది.
  • 2015 ఏప్రిల్ 1- ఏపీ కేబినెట్ రాష్ట్ర రాజధానికి అమరావతిగా పేరు పెడుతున్నట్లు ప్రకటించింది.
  • 2015 మే 25- సింగపూర్ ప్రభుత్వం అమరావతి మాస్టర్ ప్లాన్ సహా నిర్మాణానికి ఒప్పుకుంది.
  • 2015 అక్టోబర్ 22- అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
  • 2017 జులై 1- ముఖ్యమంత్రి, వివిధ శాఖల మంత్రులు అమరావతి నుంచి కార్యకలాపాలు చేపట్టారు.
  • 2019 ఫిబ్రవరి 3- హైకోర్టు నిర్మాణాని అప్పటి సుప్రీం కోర్టు సీజే రంజన్ గోగోయ్ ప్రారంభించారు.
  • 2019 మే 30- అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది.
  • 2019 జులై 23- ప్రపంచ బ్యాంక్, ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ అమరావతి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాయి.
  • 2019 సెప్టెంబర్ 13- కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం అమరావతి అభివృద్ధిపై జీఎన్ రావు కమిటీని నియమించింది.
  • 2019 నవంబర్ 11- సింగపూర్ ప్రభుత్వం అమరావతి నిర్మాణం నుంచి తప్పుకుంది.
  • 2019 డిసెంబర్ 17- రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రకటించారు.
  • 2019 డిసెంబర్ 17- సీఎం జగన్ ప్రకటనతో రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి.
  • 2019 డిసెంబర్ 18- రాజధాని గ్రామాలైన మందడం, వెలగపూడి, వెంకటాయపాలెం, కృష్ణాయపాలెం ప్రాంతాల్లో బంద్ లు, ర్యాలీలు జరిగాయి.
  • 2019 డిసెంబర్ 20- జీఎన్ రావు కమిటీ తన నివేధికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది.
  • 2020 జనవరి 3- బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌ మూడు రాజధానుల ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది.
  • 2020 జనవరి 20- మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల్ని ఆమోదించిన అసెంబ్లీ.
  • 2020 జూన్ 16- ఆ రెండు బిల్లుల్ని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన ప్రభుత్వం.
  • 2020 జులై 31- ఏపీ సీఆర్డీఏను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
  • 2020 అక్టోబర్ 11- అమరావతి జేఏసీ ర్యాలీ నిర్వహించింది.
  • 2020 డిసెంబర్ 17- అమరావతి పరిధిలోని ఉద్దండ రాయుని పాలెంలో బహిరంగ సభ జరిగింది.
  • 2021 నవంబర్ 22- కొత్త బిల్లు తెస్తామంటూ.. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరిస్తూ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం.

ఇదీ చదవండి:

Last Updated :Nov 23, 2021, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.