22వ రోజున అమరావతి రైతుల మహాపాదయాత్ర.. పాల్గొన్న మహిళలు, రైతులు

author img

By

Published : Oct 3, 2022, 10:20 AM IST

MAHAPADAYATRA

PADAYATRA : ఒకటే నినాదం.. ఒకటే సంకల్పంతో మొదలుపెట్టిన అమరావతి రైతుల రెండో విడత మహాపాదయాత్ర 22వ రోజుకి చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.

MAHAPADAYATRA : అమరావతే రాజధానిగా సాగుతున్న రైతుల మహాపాదయాత్ర 22వ రోజుకి చేరుకుంది. దూబచర్ల నుంచి ప్రారంభమైన యాత్ర.. 14కిలో మీటర్ల మేర కొనసాగనుంది. పాదయాత్రలో పాల్గొనేందుకు మహిళలు, రైతులు భారీగా తరలివచ్చారు. పాదయాత్రలో విచిత్ర వేషధారణలు ఆకట్టుకుంటున్నాయి. దూబచర్ల నుంచి ప్రకాశరావుపాలెం వరకు పాదయాత్ర సాగనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.