- 'సీబీఐ దత్తపుత్రుడికి.. తెలిసింది అదొక్కటే.. '
నోటికొచ్చిన అబద్ధాలు చెప్పడమే సీబీఐ దత్తపుత్రుడైన సీఎం జగన్కు తెలిసిన విద్య అంటూ... జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. గడప గడపలో వైకాపా ప్రజాప్రతినిధులు.. ప్రజలతో ఛీత్కారాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసి.... పాలన చేతగాని జగన్లో ఆందోళన మొదలైందని ఘాటు విమర్శలు చేశారు.
- వైకాపా నేతల మధ్య ఘర్షణ.. రివాల్వర్తో ఓ నాయకుడి హల్చల్
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెలో వైకాపాలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ స్థలం విషయంలో తలెత్తిన ఈ వివాదంలో.. ఒకరిపై మరొకరు పరస్పరం దాడి చేసుకున్నారు. లక్కిరెడ్డిపల్లి ఎంపీపీ సుదర్శన్రెడ్డి, చిన్నమండెం మండలం మాజీ జెడ్పీటీసీ అనుచరుల మధ్య.. రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంలో వివాదం తలెత్తింది.
- రాంగ్ రూట్ లో వేగంగా వచ్చి...బైక్ ని ఢీకొన్న మరో బైక్..ఒకరు మృతి...
Bike Accident: అనంతపురం శివారు కాలనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. కళ్యాణదుర్గం రోడ్డులో ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి.
- వార్తల్లోకెక్కిన "పుల్లారెడ్డి స్వీట్స్" కుటుంబం.. మనువడిపై గృహహింస కేసు..
స్వచ్ఛమైన నేతి మిఠాయిలకు కేరాఫ్ అడ్రస్గా పుల్లారెడ్డి స్వీట్స్ ప్రఖ్యాతిగాంచగా.. దాని యజమాని పుల్లారెడ్డి కుటుంబం వార్తల్లోకెక్కింది. పుల్లారెడ్డి మనువడైన ఏక్నాథ్రెడ్డిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఏక్నాథ్రెడ్డిపై ఫిర్యాదు చేసింది అతడి భార్యే కావటం చర్చనీయాంశమైంది.
- అమృత్సర్ గురునానక్ దేవ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం
Gurunanak dev hospital Fire: అమృత్సర్లోని గురునానక్ దేవ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగి ఆస్పత్రికి వ్యాపించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. 8 ఫైరింజన్లతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను వెంటనే అదపు చేసింది. అయితే అగ్ని కీలక ధాటికి ఆస్పత్రి ఆవరణలోని పార్కింగ్లో ఉన్న వాహనాలు దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
- త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ రాజీనామా
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్ ఎస్ఎన్ ఆర్యకు శనివారం తన రాజీనామా లేఖను అందించారు. త్రిపురలో పార్టీని బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని హైకమాండ్ ఆదేశించినట్లు తెలిపారు.
- 31వేల గులాబీలతో ఇల్లు.. 4 లక్షల పుష్పాలతో కళాకృతులు
తమిళనాడులో 17వ 'రోజ్ షో' సందర్శకులను ఆకట్టుకుంది. శనివారం రోజ్ షో ప్రారంభం కాగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గులాబీలతో ఏర్పాటు చేసిన పలు ఆకృతులు షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
- తండ్రి పాదాలు కడిగిన కుమారుడు.. ఇంట్లోంచి గెంటేసిన కొన్నాళ్లకే..
Son Washed Father Feet: రాత్రింబవళ్లు కష్టపడి పెంచిన కుమారుడే.. వృద్ధ తండ్రిని ఇంట్లోంచి గెంటివేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పుర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ 80 ఏళ్ల తండ్రి.. సిహోరా సబ్డివిజనల్ మేజిస్ట్రేట్ను ఆశ్రయించారు. తన గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో తండ్రీకొడుకులను నచ్చజెప్పిన ఎస్డీఎం ఆశిష్ పాండే.. వారిద్దరినీ ఒక్కటి చేశారు.
- రాయుడు ట్వీట్తో గందరగోళం.. సీఎస్కే క్లారిటీ
Ambati Rayudu: తనకు ఇదే చివరి ఐపీఎల్ అని ట్వీట్ చేసి షాక్ ఇచ్చాడు సీఎస్కే బ్యాటర్ అంబటి రాయుడు. అయితే ఆ తర్వాత కాసేపటికే ట్వీట్ను డిలీట్ చేశాడు. దీనిపై సీఎస్కే క్లారిటీ ఇచ్చింది.
- పోర్న్ ఇండస్ట్రీని ఏలిన ఈ శృంగార తారలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే?
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక.. పోర్న్ ఇండస్ట్రీ జెట్ స్పీడ్తో దూసుకుపోయింది. ఆ తర్వాత అడల్ట్ ఇండస్ట్రీలో అవకాశాలు విస్తృతంగా పెరిగాయి. ఈ క్రమంలోనే సన్నీలియోనీ లాంటి ఎందరో శృంగార తారలు వెలుగులోకి వచ్చి.. చాలా పాపులర్ అయ్యారు. అయితే కొంతమంది మాత్రం పోర్న్ సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీతో మరో రంగంలోకి అడుగుపెట్టి అక్కడ గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో ఎక్కువ మంది.. సినిమా, టీవీ రంగాల్లో రాణిస్తున్నారు. వారు ఎవరో ఒకసారి చూద్దాం.