- ఫోన్లు ట్యాప్ చేస్తున్నామని చెప్పలేదుగా.. నేనేమన్నానంటే : మంత్రి పెద్దిరెడ్డి
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో.. ఫోన్లు ట్యాప్ చేశామన్న మంత్రి పెద్దిరెడ్డి ఇవాళ మాట మార్చారు. ఫోన్లు ట్రాకింగ్ చేశారని మాత్రమే తాను అన్నానని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఫోన్లు ట్యాపింగ్ చేశారని తాను చెప్పిఉంటే అది తప్పేనని అన్నారు.
- రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. రాష్ట్రంలో ఎన్ని సీట్లంటే?
ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 4, తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
- విశాఖ వధువు మృతికేసు.. పోలీసులు ఏమన్నారంటే?
Bride death case: విశాఖ మధురవాడలో పెళ్లిపీటలపై కుప్పకూలి వధువు చనిపోయిన ఘటన కీలక మలుపు తిరిగింది. తొలుత సాధారణ మరణంగానే భావించినా.. ఆ తర్వాత అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలియనున్నాయి.
- ఉగ్రవాదుల కిరాతకం.. కశ్మీరీ పండిట్ దారుణ హత్య
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. కశ్మీరీ పండిట్ అయిన ప్రభుత్వ ఉద్యోగిని దారుణంగా కాల్చి చంపారు.
- కాంగ్రెస్ నేతల మధ్య వార్... పీసీసీ ప్రెసిడెంట్కు రమ్య సవాల్!
Karnataka Congress Ramya tweet: మండ్య మాజీ ఎంపీ రమ్య.. ట్విట్టర్ వేదికగా కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిపై విమర్శలు ఎక్కుపెట్టారు. తనపై ట్రోల్స్ చేయాలని కార్యకర్తలకు శివకుమార్ సూచించారని ఆరోపించారు. ఈ మేరకు పలు స్క్రీన్షాట్లను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
- గుడ్ న్యూస్.. ఈనెల 15న దేశంలోకి నైరుతి రుతుపవనాలు!
Southwest monsoon: భానుడి భగభగలకు ఇబ్బంది పడుతున్న ప్రజలకు గుడ్న్యూస్. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతు పవనాలు రానున్నాయి. ఈనెల 15న భారత్ను నైరుతి పవనాలు తాకనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
- ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకేఒక్కడు.. ఇకపై శ్రీలంకకు ప్రధాని!
Sri Lanka New Prime Minister: శ్రీలంకలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ కొత్త ప్రధానిని నియమించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు ఆ దేశ అధ్యక్షుడు గోటబయా రాజపక్స. తదుపరి ప్రధాన మంత్రిగా మాజీ పీఎం రణిల్ విక్రమసింఘె ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం సాయంత్రం 6.30 గంటలకు ప్రధానిగా విక్రమసింఘె బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని యూఎన్పీ సీనియర్ నేతలు వెల్లడించారు.
- దడ పుట్టిస్తున్న ధరలు.. 8ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం!
Inflation rate in India 2022: దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. మార్చిలో 6.95 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం.. ఏప్రిల్లో 7.79 శాతానికి పెరిగింది. ఇది ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి కావడం ఆందోళనకరం.
- ఉబెర్ కప్ నుంచి సింధు టీం ఔట్.. క్వార్టర్ ఫైనల్స్లో ఓటమి
Uber Cup 2022: ఉబెర్ కప్ నుంచి భారత జట్టు నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్స్లో సింధు సారథ్యంలోని మహిళల జట్టు థాయ్లాండ్ చేతిలో పరాజయం చవిచూసింది.
- ఎన్టీఆర్ లగ్జరీ లైఫ్.. రూ.4కోట్ల వాచ్.. రూ.25కోట్ల ఇల్లు.. ఇంకా ఏమున్నాయంటే?
టాలీవుడ్ టాప్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. 'ఆర్ఆర్ఆర్' సినిమా సక్సెస్తో పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు తారక్. భారీ బడ్జెట్తో తీసే.. ఎన్టీఆర్ సినిమాలు ఎంత రిచ్గా ఉంటాయో.. ఆయన పర్సనల్ లైఫ్ అంతకు మించి లగ్జరీగా ఉంటుంది. మూవీకి దాదాపు రూ. 45కోట్లు తీసుకునే తారక్ వద్ద ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి. కార్ల కలెక్షన్, పర్సనల్ జెట్, రూ.కోట్లు విలువ చేసే వాచ్.. ఇలా ఆయన వద్ద ఉన్న.. కొన్ని ఖరీదైన వస్తువుల వివరాలు మీకోసం..