AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Jun 23, 2022, 4:59 PM IST

5PM TOP NEWS

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

  • Farmers Protest: 'చేతిలో చిల్లిగవ్వ లేదు.. పంటసాగు చేసేదెలా?'
    Protest for grain purchase money: ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అన్నదాతలు ధర్నా చేపట్టారు. ధాన్యం కొనుగోలు సొమ్మును తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కనీసం నారు మడులు పోసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Tiger: కాకినాడ జిల్లాలో ఇంకా దొరకని పులి.. మళ్లీ ఆవులపై దాడి
    Tiger in kakinada District: కాకినాడ జిల్లాలో సంచరిస్తున్న పులి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. గత నెల రోజులుగా పలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాాగా ఎస్​.పైడిపాలెం శివారు పెనుగొండలో ఆవులపై పులి దాడి చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అప్పుడు చర్యలు తీసుకుని ఉంటే.. ఇప్పుడు ఇలా జరిగేది కాదు: వర్ల రామయ్య
    Varla Ramaiah letter to DGP: గుడివాడ క్యాసినో నేరస్థులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లే కంకిపాడులో నిన్న (జూన్ 22) మరో క్యాసినో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారని తెదేపా నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కంకిపాడులో అక్రమ క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన డీజీపీకి లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Vijayasai Reddy: 'ఎవరు అడ్డుపడినా.. విశాఖనే పరిపాలనా రాజధాని'
    ఎవరు అడ్డుపడినా... విశాఖనే పరిపాలనా రాజధానిగా మారుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కొన్ని కారణాల వల్లే రాజధాని తరలింపు ఆలస్యమవుతోందన్నారు. పంట కాల్వను ఆక్రమించిన తెదేపా నేత అయ్యన్నపాత్రుడికి చట్టపరంగా శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జీవచ్ఛవంలా చిన్నారి.. దేవుడి​పైనే ఆశలు.. ఈటీవీ భారత్​ కథనంతో...
    కోమాలో ఉన్న తమ చిన్నారి ఎలాగైనా కోలుకోవాలన్నది ఆ తల్లిదండ్రుల ఆశ. ఎంతో మంది వైద్యులను సంప్రదించినా ఫలితం లేదు. చివరకు కదల్లేని స్థితిలో ఉన్న బాలుడిని వెంటపెట్టుకొని చర్చికి వెళ్లారు. ఈటీవీ భారత్​ ద్వారా చిన్నారి పరిస్థితి గురించి తెలుసుకున్న ఓ ఫేస్​బుక్​ గ్రూప్​ వారికి అండగా నిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మహిళ తాకితే స్పృహ కోల్పోతున్న పూజారి.. అదే కారణమా?
    మహిళ స్పర్శ తగిలితే చాలు.. మూర్ఛపోతుండాట ఓ పూజారి. హనుమాన్ భక్తుడిని కావడం వల్లే తనకు ఇలా జరుగుతుందని అంటున్నాడు. విసుగు చెందిన కొందరు భక్తులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా నర్సు తాకడం వల్ల అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు!. కానీ ఆ తర్వాతే అసలు విషయం బయటపడింది. అసలేం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ట్విట్టర్​లో భారీ మార్పు​.. ఇకపై 2,500 అక్షరాల వరకు ట్వీట్​!
    Twitter Character Limit: ట్విట్టర్​ మనం ఏదైనా పోస్ట్ చేయాల‌నుకుంటే 280 అక్ష‌రాలు మాత్ర‌మే రాయ‌గ‌లం. అంత‌కు మించి క్యారెక్టర్లు వాడాల‌నుకుంటే మ‌రో ట్వీట్ చేయాల్సిందే. అయితే ఇప్పుడు అలా కాకుండా.. 2500 అక్షరాల వరకు ట్వీట్​ చేయొచ్చు. త్వరలోనే ఈ ఫీచర్​ను ట్విట్టర్​ అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆర్​బీఐ ఎఫెక్ట్​.. రుణ వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్న బ్యాంకులు
    Banks Raise Interest Rates: ఆర్​బీఐ పాలసీ రేట్లను పెంచిన నేపథ్యంలో.. పలు బ్యాంకులు, నాన్​-బ్యాంకింగ్​ ఫైనాన్స్​ కంపెనీలు రుణ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. ఎల్​ఐసీ హౌసింగ్​ ఫైనాన్స్​ ప్రాథమిక రుణ రేట్లను 60 బేసిస్​ పాయింట్ల మేర పెంచింది. హెచ్​డీఎఫ్​సీ గృహ రుణాలపై రిటైల్​ రుణ రేటను 50 బీపీఎస్​ పెంచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రేస్ మధ్యలో 'కోమా'లోకి స్విమ్మర్.. నీళ్లలో మునిగిపోయినా లక్కీగా...
    coach saves US swimmer: అంతర్జాతీయ స్విమ్మింగ్​ పోటీల్లో పాల్గొన్న ఓ స్విమ్మర్​.. చావు అంచుల దాకా వెళ్లి వచ్చింది. అక్కడే ఉన్న ఆమె కోచ్​ అప్రమత్తం అవ్వడం వల్ల అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడింది. అసలేం జరిగిందంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ మధ్య చర్చలు సఫలం.. దిల్​రాజు అధ్యక్షతన కమిటీ
    ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో షూటింగ్స్​కు యథావిధిగా హాజరు కానున్నట్లు సినీ కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.