- Complaint: వైకాపా నాయకుడు బెదిరిస్తున్నాడు..పోలీసులకు మహిళ ఫిర్యాదు
Complaint: వైకాపా నాయకుడు తనను బెదిరిస్తున్నాడని ఓ మహిళ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ పాఠశాలలో వంట మనిషిగా పని చేసినప్పుడు.. విద్యార్థుల పట్ల నిర్వాహకుల తీరును వ్యతికేరించినందుకు తనను తొలగించారని తెలిపారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
- Marriages at Nuvvalarevu: రెండేళ్లకోసారి పెళ్లిళ్లు.. ఊరంతా పండగే
Marriages at nuvvalarevu: ఆ ఊళ్లో రెండేళ్ల తర్వాత పెళ్లి భాజాలు మోగాయి. ఒకే ముహూర్తంలో 45 జంటలు ఒక్కటయ్యాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతూరు, అత్తమామలు, బావ, బావమరుదులు.. ఇలా ఒకరేంటి.. పెళ్లింట అంతా పరిచయస్థులే.! చిన్నప్పటి నుంచీ ఒకే ఊళ్లో పుట్టి పెరిగినోళ్లే..! అందుకే ఆ గ్రామంలో పెళ్లంటే వధూవరుల ఇంటి వేడుక కాదు.. ఊరంతా పండగ..! ఆ పెళ్లి సందడి మనమూ చూసొద్దామా..!
- అండర్వరల్డ్ డాన్ 'దావూద్' గ్యాంగ్లో ఇద్దరు అరెస్ట్.. చోటా షకీల్తో!
NIA Arrests Chhota Shakeel Aides: డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్కు చెందిన ఇద్దరిని ముంబయిలో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. వీరిద్దరూ గ్యాంగ్స్టర్ చోటా షకీల్ అనుచరులు. అరెస్టైన వారిని 59 ఏళ్ల ఆరీఫ్ అబుబకర్ షేక్, 51 ఏళ్ల షబ్బీర్ అబూ బకర్షేక్గా గుర్తించారు అధికారులు.
- కశ్మీర్ పండిట్ మృతిపై జమ్ముకశ్మీర్లో ఆందోళనలు
Kashmir pandit killed: కశ్మీర్ పండిట్ అయిన ఓ ప్రభుత్వ ఉద్యోగి హత్యపై జమ్ముకశ్మీర్లో నిరసనలు వెల్లువెత్తాయి. రాహుల్ భట్ హత్యపై ఆందోళనకు దిగారు కశ్మీర్ పండిట్ వర్గం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు.
- విద్యార్థినిపై కారులో గ్యాంగ్ రేప్.. డీఎస్పీ అంకిత ఎంట్రీతో...
Gang rape in Ranchi: పాఠశాల విద్యార్థినిని అపహరించి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. ఈ దుర్ఘటన ఝార్ఖండ్ రాజధాని నగరంలో గురువారం రాత్రి జరిగింది. మధ్యప్రదేశ్లో జరిగిన మరో ఘటనలో మేకల కొట్టంలో ఓ మహిళ మృతదేహం నగ్నంగా పడి ఉండటం కలకలం రేపింది. ఆమె జననాంగాలను ఛిద్రం చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
- 'నేను చనిపోలే.. సమాధిలోకి వెళ్లా అంతే! 27 మంది డాక్టర్లతో..'
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి చనిపోయారని కొద్దిరోజులుగా పుకార్లు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఆయన స్పష్టతనిచ్చారు. సమాధిలోకి వెళ్లానని, ప్రస్తుతం మనుషులను గుర్తుపట్టలేకపోతున్నట్లు, మాట్లాడలేకపోతున్నట్లు ఆయన ఫేస్బుక్ పేజ్లో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది.
- నూనె, పాలు, గుడ్లు, చికెన్ ధరలు ఒక్కసారే ట్రిపుల్- ఆ దేశంలో కల్లోలం!
Iran inflation rate: ఇరాన్ ప్రజల నెత్తిన ధరల పిడుగు పడింది. వంట నూనె, పాలు, గుడ్లు, చికెన్ వంటి నిత్యావసరాల ధరల్ని ఒక్కసారిగా 300% పెంచింది అక్కడి ప్రభుత్వం. ప్రజల్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసిన ఈ నిర్ణయం.. దేశంలో అనిశ్చితికి దారితీయొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
- ట్విట్టర్ టాప్ మేనేజర్స్పై 'మస్క్' వేటు.. పరాగ్, గద్దె విజయ భవిష్యత్తేమిటో?
Twitter fires two top executives: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా ఇద్దరు టాప్ మేనేజర్లపై వేటు వేసింది ట్విట్టర్. వారిని విధుల్లోంచి తొలగించింది. ఈ క్రమంలో ప్రస్తుత సీఈఓ పరాగ్ అగర్వాల్, గద్దె విజయ భవిష్యత్తు ఏమిటని చర్చలు మొదలయ్యాయి.
- గంట గట్టిగా మోగించిన సర్కారువారి పాట.. తొలిరోజు ఆల్టైం రికార్డు కలెక్షన్స్!
Mahesh Babu News: సూపర్స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారువారి పాట చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలిరోజు రూ.36.89 కోట్ల షేర్ వసూలు చేసి ఆల్టైం నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించింది.
- 2.5 కోట్ల మంది ఫాలోవర్స్కు శిల్పా శెట్టి షాక్
సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే శిల్పాశెట్టికి ఇన్స్టాగ్రాంలో 2.54కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారందరీ షాక్ ఇస్తూ ఈ యోగా సుందరి అనూహ్య నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాకు తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పింది.