trains: 11 రైళ్ల రాకపోకలు పునరుద్ధరణ.. సాధారణ మార్గం నుంచే రాకపోకలు

author img

By

Published : Nov 22, 2021, 9:32 AM IST

Updated : Nov 22, 2021, 10:22 AM IST

11-train-services-resumed-as-flood-recedes

09:29 November 22

గూడూరు - విజయవాడ రైలు మార్గంలో తగ్గిన వరద ఉద్ధృతి

గూడూరు - విజయవాడ రైలు మార్గంలో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో 11 రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. సాధారణ మార్గం నుంచే రాకపోకలు సాగుతాయని అధికారులు వెల్లడించారు. 

భువనేశ్వర్‌ - బెంగళూరు, న్యూటింసుకియా-బెంగళూరు, జైపూర్‌- చెన్నై సెంట్రల్‌, న్యూదిల్లీ- తిరువనంతపురం, నిజాముద్దీన్‌- చెన్నై సెంట్రల్‌, న్యూదిల్లీ- చెన్నై సెంట్రల్‌ రైళ్ల రాకపోకలు పునరుద్దరించారు. అలాగే చెన్నై సెంట్రల్‌ - న్యూదిల్లీ, గోరఖ్‌పూర్‌ - కోచువెలి, అహ్మదాబాద్‌ - చెన్నై సెంట్రల్‌, దానపుర్‌ - బెంగళూరు, భువనేశ్వర్‌ - బెంగళూరు రైలు రాకపోకలను సాగుతాయని అధికారులు తెలిపారు.  

ఇదీ చూడండి: Trains cancelled today: ప్రయాణికులకు విజ్ఞప్తి.. వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు.. అవేంటంటే..?

Last Updated :Nov 22, 2021, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.