ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

author img

By

Published : Jan 25, 2023, 12:13 PM IST

gold rate today in hyderabad and vijayawada

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి.. ప్రస్తుతం రూ.58,846 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.50 స్వల్పంగా పెరిగి.. ప్రస్తుతం రూ. 69,959 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.58,846 గా ఉంది. కిలో వెండి ధర రూ.69,959 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.58,846 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,959 గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,846 గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,959 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.58,846 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.69,959 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1929.15 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.61 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.18,49,221 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.18,49,221
ఇథీరియంరూ.1,26,373
టెథర్​రూ.81.65
బైనాన్స్​ కాయిన్​రూ.24,626
యూఎస్​డీ కాయిన్రూ.81.64

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 60,806 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 60 పాయింట్లు నష్టపోయి 18,056 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో మారుతీ, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి మారకం..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 20 పైసలు పెరిగి.. 81.50 వద్ద ట్రేడవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.