స్థిరంగా బంగారం ధర.. వెండి పతనం.. స్టాక్ మార్కెట్లకు ఫెడ్ భయాలు

author img

By

Published : Sep 21, 2022, 12:24 PM IST

Gold Rate Today

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. వెండి ధర కాస్త పడిపోయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల ప్రస్తుతం రూ.51,100గా ఉంది. కేజీ వెండి ధర రూ.150‬ తగ్గింది. ప్రస్తుతం రూ.57,870 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,100గా ఉంది. కిలో వెండి ధర రూ.57,870 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,100 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,870గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,100గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,870 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,100 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.57,870 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1670 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.40 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు.. బిట్​కాయిన్ ధర రూ.31,700 మేర పడిపోయింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,11,000 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.15,11,000
ఇథీరియంరూ.1,06,300
టెథర్​రూ.79.82
బినాన్స్​ కాయిన్​రూ.21,274
యూఎస్​డీ కాయిన్రూ.79.87

Stock Market Updates : అంతర్జాతీయ ప్రతికూలతల వల్ల స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంశంపై దృష్టిసారించిన మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. స్వల్ప లాభంతో సెన్సెక్స్ ప్రారంభమైనప్పటికీ.. క్రమంగా నష్టాల్లోకి మళ్లింది. ప్రస్తుతం 160 పాయింట్లు పతనమై 59,493 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ 84 పాయింట్లు దిగజారి.. 17,731 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి: సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌యూఎల్‌, ఎంఅండ్‌ఎం, నెస్లే ఇండియా, ఐటీసీ, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ: డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పైసలు దిగజారింది. ప్రస్తుతం రూపాయి విలువ 79.82 వద్ద ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.