స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

author img

By

Published : Sep 20, 2022, 10:28 AM IST

Updated : Sep 20, 2022, 3:00 PM IST

gold

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి.

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల రూ.220 పెరిగి.. ప్రస్తుతం రూ.51,120గా ఉంది. కేజీ వెండి ధర రూ.320 పెరిగి.. రూ.58,020 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,120గా ఉంది. కిలో వెండి ధర రూ.58,020 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,120 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,020గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,120గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,020 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,120 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.58,020 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1675 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.50 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,37,266 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.15,37,266
ఇథీరియంరూ.1,07,723
టెథర్​రూ.79.64
బినాన్స్​ కాయిన్​రూ.21,423
యూఎస్​డీ కాయిన్రూ.79.68

Stock Market Updates : దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూల పవనాలతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్‌ 740 పాయింట్లు ఎగబాకి 59,880 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 230 పాయింట్ల లాభంతో 17,840 దగ్గర ట్రేడవుతోంది. టాప్‌ 30 సూచీల్లో అన్ని కంపెనీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​సీఎల్ టెక్​, ఐసీఐసీఐ, బజాజ్ ఫిన్​జర్వ్, ఎల్​టీ, టెక్ మహీంద్రా.. సంస్థలు భారీ లాభాల్లో ఉన్నాయి.
రూపాయి విలువ: మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి విలువ.. 16 పైసలు లాభపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే.. ప్రస్తుతం 79.65కు చేరింది.

ఇవీ చదవండి: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పండగ సేల్స్.. ఆ కార్డులపై భారీగా రాయితీ

భారత్‌లో తొలి చిప్‌ ఫ్యాక్టరీ వచ్చేస్తోంది.. రెండేళ్లలో ఉత్పత్తి షురూ!

Last Updated :Sep 20, 2022, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.