మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Jun 22, 2022, 12:43 PM IST

Gold Price Today

Gold Price Today: బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,390గా ఉంది. కిలో వెండి ధర రూ.62,024గా ఉంది.

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం బంగారం ధర రూ.200 తగ్గింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.52,390 వద్ద ఉంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ. 700 తగ్గి రూ.62,024 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,390గా ఉంది. కిలో వెండి ధర రూ.62,024వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,390గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,024గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,390గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,024 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,390గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,024 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 1825 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.32 డాలర్లుగా ఉంది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.78 వద్ద ఉంది.

ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో బిట్ కాయిన్ విలువ తగ్గింది. ప్రస్తుతం రూ.16,68,738 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.16,68,738
ఇథీరియం రూ. 89,275
టెథర్ రూ.82.97
బినాన్స్​ కాయిన్ రూ.17,700
యూఎస్​డీ కాయిన్ రూ.83.20

Stock Market Live Updates: గత సెషన్​లో భారీ లాభాలు నమోదుచేసిన దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు మళ్లీ భారీగా నష్టపోయాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 570 పాయింట్లకుపైగా కోల్పోయి.. 51 వేల 950 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 180 పాయింట్లకుపైగా నష్టంతో.. 15 వేల 450 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్​ 30 ప్యాక్​లో మారుతీ మినహా అన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్​ ఆటో కూడా రాణిస్తోంది. హిందాల్కో, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, యూపీఎల్​, టాటా స్టీల్​, బజాజ్​ ఫిన్​సర్వ్​ 3 శాతానికిపైగా పడిపోయాయి. మంగళవారం సెషన్​లో సెన్సెక్స్​ 934, నిఫ్టీ 289 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. ఒక్కరోజులోనే మళ్లీ నష్టాల బాట పట్టాయి దేశీయ సూచీలు.

అమెరికా, ఐరోపా మార్కెట్లు మంగళవారం లాభాలతోనే ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు మాత్రం నేడు మిశ్రమంగా చలిస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే జపాన్‌ కరెన్సీ యెన్‌ విలువ 24 ఏళ్ల కనిష్ఠానికి చేరడం ఆసియా మార్కెట్లను కలవరపరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతున్నప్పటికీ.. జపాన్‌ మాత్రం ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు మరిన్ని వడ్డీరేట్ల పెంపులు, రష్యా గ్యాస్‌ను ఐరోపా దేశాలు నిలువరించనున్నాయన్న వార్తలు మార్కెట్లను కలవరపరుస్తున్న అంశాలు.

ఇవీ చదవండి: '3 నెలల్లో 10 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తాం'

ట్విట్టర్ 'డీల్'​కు బోర్డు ఆమోదం.. 3 శాతం పెరిగిన షేర్ల విలువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.