స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Nov 22, 2022, 11:26 AM IST

gold rate today

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.140 తగ్గి.. ప్రస్తుతం రూ.54,130 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.550 పెరిగి.. రూ.63,100 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.54,130 గా ఉంది. కిలో వెండి ధర రూ.63,100 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,130వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,100గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,130గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,100 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.54,130వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.63,100గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,742.50 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.06 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.12,91,100 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.12,91,100
ఇథీరియంరూ.89,880
టెథర్​రూ.81.69
బినాన్స్​ కాయిన్​రూ.20,863
యూఎస్​డీ కాయిన్రూ.81.80

స్టాక్​ మార్కెట్లు: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్​ 155 పాయింట్లు లాభపడి.. 61,300 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 48 పాయింట్లు ఎగబాకి.. 18,208 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, టైటాన్​, ఐటీసీ, బజాజ్ ఫిన్​సర్వ్​, భారతీ ఎయిర్​టెల్​షేర్లు​ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎస్​బీఐ, విప్రో, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, సన్​ఫార్మా, కొటక్ బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి విలువ:
అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం పెరిగింది. ట్రేడింగ్ ప్రారంభంలో 14 పైసలు లాభపడి.. ప్రస్తుతం 81.65కు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.