స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో రేట్లు ఇలా..

author img

By

Published : Nov 21, 2022, 10:45 AM IST

Today gold rates

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.230 తగ్గింది. కేజీ వెండి ధర రూ.386 మేర తగ్గింది. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ప్రస్తుతం రూ.54,270వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,550 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.54,270 గా ఉంది. కిలో వెండి ధర రూ.62,550 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,270వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,550గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,270గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,550 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.54,270వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.62,550గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,746.50 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 20.78 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,08,668 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.13,08,668
ఇథీరియంరూ.91,601
టెథర్​రూ.81.73
బినాన్స్​ కాయిన్​రూ.21,241
యూఎస్​డీ కాయిన్రూ.81.90

స్టాక్​ మార్కెట్లు:
దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు ఈవారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 438 పాయింట్ల నష్టంతో 61,224 వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోయి 18,184 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, రిలయన్స్‌, నెస్లే ఇండియా, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో కొనసాగతున్నాయి.

రూపాయి విలువ:
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు క్షీణించి రూ.81.84 వద్ద ట్రేడవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.