వరుస లాభాలకు బ్రేక్​- సెన్సెక్స్​ 49 పాయింట్లు డౌన్

author img

By

Published : Oct 19, 2021, 3:45 PM IST

Stocks close

గడిచిన వారం రోజులుగా లాభాల బాటలో పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్లు(Stcok markets) మంగళవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 49 పాయింట్లు, నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయాయి.

స్టాక్​ మార్కెట్ల ఏడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. మంగళవారం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ ​మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బుల్​ జోరుతో ఒకానొకదశలో జీవితకాల గరిష్ఠానికి చేరుకున్న సూచీలు.. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం వల్ల ఆరంభ లాభాలు ఆవిరై నష్టాలు చవిచూశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్(Bse sensex) మంగళవారం ఉదయం 62,156 వద్ద ప్రారంభమైంది.​ ఒక దశలో భారీగా పుంజుకుని 62,245 పాయింట్ల జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపటం వల్ల 49 పాయింట్లు కోల్పోయి 61,716 వద్ద ముగిసింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ(nifty today) ఉదయం 18,602 వద్ద ప్రారంభం కాగా.. ఒక దశలో 18,604 పాయింట్ల జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 58 పాయింట్ల నష్టంతో 18,418 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివి..

టెక్​ మహీంద్రా 4.46 శాతం మేర లాభపడగా.. ఎల్​ అండ్​ టీ(3.54శాతం), ఇన్​ఫోసిస్ 1.69 శాతం , బజాజ్​ ఫిన్​సెర్వ్​ 1.67 శాతం, కొటక్​ బ్యాంక్​ 1.29 శాతం మేర లాభపడ్డాయి.

ఐటీసీ 6.27 శాతం మేర నష్టపోయింది. హిందుస్థాన్ యూనిలివర్​ 3.70, టైటాన్​ 3.53, పవర్ గ్రిడ్​ 3.34, టాటాస్టీల్​ 3.13శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇవీ చూడండి: 'రైల్వే' అరుదైన ఘనత- రూ.లక్ష కోట్ల క్లబ్​లోకి ఐఆర్​సీటీసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.