Stock Market today: బుల్​ జోరు.. జీవితకాల గరిష్ఠాలకు సూచీలు

author img

By

Published : Oct 13, 2021, 3:39 PM IST

STOCKS CLOSE

స్టాక్​మార్కెట్లు బుధవారం కూడా లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 450 పాయింట్లకుపైగా పెరిగింది. నిఫ్టీ 170 పాయింట్ల లాభంతో.. 18 వేల 160 ఎగువన స్థిరపడింది.

స్టాక్​మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. ఐటీ, ఆటో, లోహ రంగం షేర్ల అండతో సెన్సెక్స్​, నిఫ్టీలు జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. ఆఖర్లో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపగా లాభాలు పరిమితమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 453 పాయింట్ల లాభంతో 60 వేల 737 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 170 పాయింట్లు పెరిగి 18 వేల 162కి చేరింది.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 60,837 పాయింట్ల అత్యధిక స్థాయి, 60,452 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 18,198 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 18,051 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లో..

టాటా మోటార్స్​ అత్యధికంగా 20 శాతానికిపైగా లాభపడింది. ఒక్క సెషన్​లోనే దాదాపు 90 పాయింట్లు పెరిగింది.

ఎం అండ్​ ఎం, ఐటీసీ, అదానీ పోర్ట్స్​ కూడా భారీగా లాభాలు నమోదు చేశాయి.

మారుతీ సుజుకీ, ఓఎన్​జీసీ, కోల్​ ఇండియా, హెచ్​యూఎల్​, ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​ నష్టపోయాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.