స్టాక్ మార్కెట్లు (Stock Market) గురువారం సెషన్ను లాభాలతో ముగించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 569 పాయింట్లు పెరిగి 61,305 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 176 పాయింట్ల లాభంతో 18,339 వద్దకు చేరింది.
తొలుత అంతర్జాతీయ సానుకూలతలతో మార్కెట్లో అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. వీటికి తోడు 21 కంపెనీలు నేడు ఫలితాలు వెల్లడించనున్నాయి అనే వార్తలు మదుపరుల సెంటిమెంట్ను బలపరిచింది. దీంతో సెన్సెక్స్ తొలిసారిగా 61 వేల మార్కును దాటింది.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 61,353 పాయింట్ల అత్యధిక స్థాయి, 60,978 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 18,350 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 18,248 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లో..
ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ షేర్లు లాభాలను ఆర్జించాయి.
హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, సన్ఫార్మా షేర్లు నష్టపోయాయి.
భారీగా పెరిగిన విప్రో షేరు..!
సాఫ్ట్వేర్ దిగ్గజం విప్రో షేరు ధర భారీగా పెరిగింది. నేటి ట్రేడింగ్లో జీవనకాల గరిష్ఠానికి చేరింది. నేటి ట్రేడింగ్లో 8 శాతం విలువ పెరిగి రూ.723.65 మార్కును తాకింది. ఐటీ సేవల్లో ఆదాయంలో 8.1శాతం వృద్ధి నమోదు కావడంతో మదుపరుల్లో ఆశలను పెంచింది. దీంతో షేరు గతంలో ఉన్న రూ.698.95 విలువను దాటేసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.4లక్షల కోట్లను తాకింది. భారత్లో ఈ మార్కును తాకిన 13వ లిస్టెడ్ సంస్థగా విప్రో నిలిచింది.