లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు- 60,250 పైకి సెన్సెక్స్​

author img

By

Published : Oct 12, 2021, 9:36 AM IST

Updated : Oct 12, 2021, 3:47 PM IST

stock market live updates

15:40 October 12

స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 149 పాయింట్లు పెరిగి 60,284 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో తొలిసారి 17,992 వద్దకు చేరింది.

  • టైటాన్​, బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్, ఎస్​బీఐ, నెస్లే ఇండియా ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​సీఎల్​టెక్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్​ సిమెంట్​, టీసీఎస్, సన్​ ఫార్మా నష్టాపోయాయి.

13:26 October 12

నష్టాల్లో సూచీలు

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 79 పాయింట్లకుపైగా కోల్పోయి 60,056 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 21 పాయింట్లకుపైగా తగ్గి.. 17,925 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా తెలుస్తోంది. 

  • టైటాన్, బజాజ్​ఫిన్​సర్వ్, బజాజ్​ ఆటో, ఎస్​బీఐ, కోటక్ బ్యాంక్, ఐటీసీ షేర్లు  ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​సీఎల్, టెక్​ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, ఎం అండ్ ఎం, టీసీఎస్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:13 October 12

స్టాక్​ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్

అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు (Stock Market Live) మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 100 పాయింట్లకుపైగా కోల్పోయి.. 60,030 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 20 పాయింట్ల నష్టంతో  17,925 వద్ద కొనసాగుతోంది. 

  • ఐటీసీ, బజాజ్​ఆటో​, టాటాస్టీల్​, ​ఎస్​బీఐ, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • మహీంద్ర అండ్ మహీంద్ర, ఇన్ఫోసిస్, మారుతీ, పవర్​గ్రిడ్, నెస్లే​ నష్టాల్లో ట్రేడింగ్ సాగిస్తున్నాయి.
Last Updated :Oct 12, 2021, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.