ఐదు సెషన్ల జోరుకు బ్రేక్​- ఫ్లాట్​గా ముగిసిన సూచీలు

author img

By

Published : Jan 14, 2022, 3:38 PM IST

STOCK MARKET CLOSING

Stock Market Closing: స్టాక్​ మార్కెట్ల జోరుకు బ్రేక్​ పడింది. ఐదు వరుస సెషన్ల లాభాల అనంతరం.. వారాంతంలో దేశీయ మార్కెట్​ సూచీలు ఫ్లాట్​గా ముగిశాయి.

Stock Market Closing: వారాంతపు సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు ఫ్లాట్​గా ముగిశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ స్వల్పంగా 12 పాయింట్లు కోల్పోయింది. చివరకు 61 వేల 223 వద్ద స్థిరపడింది.

శుక్రవారం ట్రేడింగ్​ తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగింది. సూచీలు ఆరంభంలో భారీ నష్టాల్లో మొదలయ్యాయి. దాదాపు 200 పాయింట్ల నష్టంతో సెషన్​ను ప్రారంభించిన సెన్సెక్స్​.. ఓ దశలో 450 పాయింట్లకుపైగా కోల్పోయింది. 60 వేల 757 వద్ద సెషన్​ కనిష్ఠాన్ని తాకింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి.. 18 వేల 256 వద్ద సెషన్​ను ముగించింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఐటీ, రియాల్టీ రంగాల షేర్లు దూసుకెళ్లాయి. ఆటో, ఫార్మా, బ్యాంకింగ్​ రంగాల్లో అమ్మకాలతో నష్టపోయాయి.

ఐఓసీ, టీసీఎస్​, ఇన్ఫోసిస్​, ఎల్​ అండ్​ టీ లాభాలు నమోదుచేశాయి.

ఏషియన్​ పెయింట్స్​, యాక్సిస్​ బ్యాంక్​, యూపీఎల్​, హెచ్​యూఎల్​, ఎం అండ్​ ఎం నష్టపోయాయి.

ఇవీ చూడండి: Demat Nominee: డీమ్యాట్‌ ఖాతా నామినీ పేరు రాశారా?

WPI Inflation: డిసెంబర్​లో తగ్గిన టోకు ద్రవ్యోల్భణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.