పెట్రోల్ బంక్​ లైసెన్స్​తోనే ఈవీ ఛార్జింగ్​ స్టేషన్​కూ అనుమతి

author img

By

Published : Oct 10, 2021, 6:19 PM IST

new licencing norms for Petrol pumps

2019లో సవరించిన పెట్రోల్ బంక్​ల లైసెన్సింగ్ నిబంధనలపై కేంద్రం మరోసారి కీలక ప్రకటన చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. పెట్రోల్​ బంక్​ల ఏర్పాటుకు లైసెన్స్​ పొందిన సంస్థలు.. పెట్రోల్​, డీజిల్ విక్రయాలకు ముందే.. విద్యుత్​ వాహనాల ఛార్జింగ్ పాయింట్, సీఎన్​జీ వంటి ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

పెట్రోల్​ బంక్​​ల ఏర్పాటు లైసెన్సింగ్ రూల్స్​పై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. సవరించిన నిబంధనల ప్రకారం.. పెట్రోల్​ బంకుల్లోనే.. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ పాయింట్​​, సీఎన్​జీ అవుట్​లెట్స్​ పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది. పెట్రోల్​, డీజిల్ విక్రయాలను ప్రారంభించకముందే.. వాటిని ఏర్పాటు చేయొచ్చని వెల్లడించింది.

2019 నంబర్​ 8న విడుదల చేసిన ఉత్తర్వులపై మరోసారి స్పష్టతనిస్తూ.. తాజాగా ఓ ప్రకటన చేసింది. ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్​జీ, ఎల్​ఎన్​జీ, ఎలక్ట్రిక్​ వెహికిల్ ఛార్జింగ్​ పాయింట్లను.. పెట్రోల్​, డీజిల్​తో పాటే ఏర్పాటు చేసుకునేందుకు వీలున్నట్లు ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. అయితే వీటి ఏర్పాటుకు అవసరమైన ఆర్డర్​ను మాత్రం అందులో పొందుపరచలేదు.

ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ రిటైల్​ పెట్రోల్, డీజిల్​ అవుట్​లెట్​ పెట్టాలనుకుంటే.. ఆ సంస్థ కనీసం ఏదైన ఒక ప్రత్యామ్నాయ ఇంధన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.

అయితే 2019 ఆర్డర్​లో.. పెట్రోల్​, డీజిల్​.. ప్రత్యామ్నాయ ఇంధనల ప్రారంభ క్రమాన్ని మాత్రం సూచించలేదు. దీని ప్రకారం ప్రత్యామ్నాయ ఇంధనాల విక్రయాన్ని పెట్రోల్​, డీజిల్ కన్నా ముందే ప్రారంభించొచ్చని వివరించింది.

కొత్త రూల్స్​లో ఇంకా ఏముందంటే..

పెట్రోల్​, డీజిల్ రిటైల్ ఔట్​లెట్​ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే.. ఆ సంస్థ విలువ కనీసం రూ.250 కోట్లు ఉండాలి.

2019 నవంబర్ పాలసీ ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్​, ఐఎంసీ లిమిటెడ్​, ఆన్​సైట్​ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్​, అసోం గ్యాస్​ కంపెనీ, ఎంకే ఆగ్రోటెక్​, ఆర్​బీఎంఎల్​ సొల్యూషన్స్​ ఇండియా లిమిటెడ్​, మానస్​ ఆగ్రో ఇండస్ట్రీస్​, ఇన్​ఫ్రాస్ట్రక్చర్స్​ వంటి సంస్థలు ఇప్పటి వరకు.. పెట్రోల్​ బంక్​​ లైసెన్సింగ్​ అనుమతులు పొందాయి

రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్​ఐఎల్​)​ ఇదివరకే ఇంధనాల రిటైల్ విక్రయానికి లైసెన్స్​ ఉంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఈ సంస్థ 1,400 పెట్రోల్​ బంక్​లను నిర్వహిస్తోంది. అయితే ఈ లైసెన్స్​ను దాని అనుబంధ సంస్థ రిలయన్స్ బీపీ మొబిలిటీకి బదిలీ చేసింది ఆర్​ఐఎల్​. అందుకే.. ఈ సంస్థ మరో లైసెన్స్​ కోసం దరఖాస్తు చేసి.. అనుమతులు పొందింది.

ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన.. ఇండియన్​ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్​ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్​ (బీపీసీఎల్​) హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్​ (హెచ్​పీసీఎల్) దేశవ్యాప్తంగా 78,751 పెట్రోల్ బంక్​లను కలిగి ఉన్నాయి. చమురు రిటైల్ మార్కెటింగ్​లో వీటిదే అత్యధిక వాటా.

ప్రేవేటు సంస్థలు చూసుకుంటే.. ఆర్​బీఎంఎల్​, నయారా ఎనర్జీ (ఇంతకు ముందు ఎస్సర్ ఆయిల్​), రాయల్​ డచ్​ షెల్​ వంటి కంపెనీలు అత్యధిక వాటా ఉన్న ప్రైవేటు కంపెనీలు. ఇందులో ఆర్​బీఎంఎల్​కు 1,427, నయారాకు 6,250, షెల్ 258 పెట్రోల్ బంక్​లను మాత్రమే కలిగి ఉన్నాయి.

బీపీ సంస్థ.. 3,500 పెట్రోల్​ బంక్​లను ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికే లైసెన్స్ దక్కించుకుంది. అయితే ఇప్పటి వరకు ఆ ప్రక్రియ ప్రారంభమవలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్​తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనితో మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సామర్థ్యం 5,500 బంక్​లకు పెరగనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.