టీకాలు కొనేందుకు భారత్​కు ఏడీబీ రూ.11 వేల కోట్ల రుణం

author img

By

Published : Nov 25, 2021, 4:58 PM IST

adb loan to india for covid-19

adb loan to india for covid-19: టీకాల కొనుగోలు కోసం భారత్​కు ఆసియా అభివృద్ధి బ్యాంకు రూ.11,185 కోట్ల రుణాన్ని ఆమోదించింది. భవిష్యత్​లో వైరస్​ వ్యాప్తి నుంచి భారత్​ తమ పౌరులను రక్షించుకోవడానికి ఈ నిధి​ ఉపయోగపడనుందని ఓ ప్రకటనలో వెల్లడించింది.

వ్యాక్సిన్ కొనుగోలు కోసం భారత్​కు రూ.11,185 కోట్ల రుణాన్ని ఆమోదించింది ఆసియా అభివృద్ధి బ్యాంకు(adb loan to india for covid-19). ఈ మేరకు గురువారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఆసియా ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకు కూడా భారత్​కు మరో రూ. 3,725 కోట్లను ఇవ్వనుందని సమాచారం. ఏడీబీ ఫండ్​తో దాదాపు 31.7 కోట్ల మందికి సరిపోయే విధంగా 66.7 కోట్ల టీకా డోసులు భారత్​ కొనుగోలు చేయగలదు.

'భవిష్యత్​లో వైరస్​ వ్యాప్తి నుంచి తమ పౌరులను రక్షించుకోవడానికి ఈ నిధి​ ఉపయోగపడనుంది. భారత్​లో 18 ఏళ్ల పైనున్న 94.47 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించడానికి ఈ రుణం సహకరిస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైన కారణంగా టీకాలు చాలా కీలకంగా మారాయి.' అని ఏడీబీ అధ్యక్షుడు మసత్సుగు అసకవా తెలిపారు.

వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన సాంకేతిక సహాయం కోసం భారత్​కు రూ.30 కోట్ల సహాయాన్ని(adb loan to india) ఇప్పటికే అందించింది ఏడీబీ. డబ్ల్యూహెచ్​వో, యూనిసెఫ్​ అనుసంధానంతోనే ఏడీబీ తమ దేశాలకు ఆర్థికంగా మద్దతునిస్తోంది.

ఇవీ చదవండి:కరోనా నివారణకు ఐటీసీ నాజల్ స్ప్రే!

శాం​సంగ్ ఇండియాలో భారీగా ఉద్యోగ అవకాశాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.