పుట్టింటికి వెళ్లడానికి ఒప్పుకోని భర్త​.. కోపంతో మామ మర్మాంగాల్ని​ కోసిన మహిళ

author img

By

Published : Sep 28, 2022, 5:06 PM IST

woman cutsoff her father in law testicles and seven year girl murdered by young man

కన్నవారింటికి వెళ్లొదన్నారనే కోపంతో మామ మర్మాంగాలను కోసిపడేసింది ఓ కోడలు. ఈ ఘటన బంగాల్​లో జరిగింది. మరోవైపు, ఏడేళ్ల బాలికను ఎత్తుకుపోయి దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. మహారాష్ట్రలో జరిగిందీ ఘటన.

బంగాల్​లోని మైనా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్నవారింటికి వెళ్లొద్దన్నారన్న కోపంతో దారుణానికి ఒడిగట్టింది ఓ కోడలు. మామ మర్మాంగాలను కోసి పడేసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. తూర్పు మేదినీపుర్​ పోలీస్​స్టేషన్​ పరిధికి చెందిన శిఖా అనే మహిళను మాంసం తినేందుకు తన తండ్రి రమ్మని ఫోన్ చేశాడు. వెంటనే ఆమె తన భర్తకు కాల్​ చేయగా.. అతడి వెళ్లవద్దని చెప్పాడు. తాను చికెన్​ తెస్తానని ఇంట్లోనే వండుకుని తిందామని తెలిపాడు. కాల్​ కట్​ చేసిన తర్వాత మహిళ.. కోపంతో తన అత్తామామలను తీవ్రంగా దూషించింది. అది కాస్తా వాగ్వాదానికి దారితీసింది.

దీంతో మరింత కోపం పెంచుకున్న మహిళ.. తన మామ మర్మాంగాలను కత్తితో కోసిపడేసింది. అతడు నొప్పితో గట్టిగా కేకలు పెట్టగా.. స్థానికులు వచ్చి ఆస్పత్రిలో చేర్పించారు. స్థానికులు మహిళను బంధించారు. అయితే ఆమె విడిపించుకుని కన్నవారింటికి పారిపోయింది. అనంతరం బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాల్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు ఆమెకు 14 రోజుల కస్టడీ విధించింది.

ఏడేళ్ల బాలిక హత్య..
మహారాష్ట్రలోని ఇందోర్​లో ఏడేళ్ల బాలికను ఎత్తుకుపోయి దారుణ హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. గమనించిన స్థానికులు.. నిందితుడ్ని పోలీసులకు అప్పగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆజాద్ నగర్​ పోలీస్​స్టేషన్​ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలికను.. అదే ప్రాంతంలో ఉంటున్న సద్దాం అనే యువకుడు ఎత్తుకుపోయాడు. అనంతరం తన ఇంటికి తీసుకెళ్లి తలుపు గడియపెట్టాడు. ఇది చూసిన ఓ బాలుడు.. స్థానికులకు తెలియజేశాడు. వెంటనే స్థానిక ప్రజలంతా సద్దాం ఇంటి వద్దకు చేరుకుని బాలికను విడిచిపెట్టమని ప్రాధేయపడినా అతడి వినిపించుకోలేదు.

తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా బాలిక విగతజీవిగా పడి ఉంది. చిన్నారిని పలుమార్లు కత్తితో పొడిచి చంపాడు సద్దాం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికులు.. సద్దాంను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్​ చేశారు.

పెళ్లి చేసుకుంటానని చెప్పి కారులో అనేక సార్లు రేప్..
మహారాష్ట్రలోని ఠానే జిల్లాలో బాలీవుడ్​ సినిమా తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని ఓ యువతితో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఆమె ప్రియుడు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి బయటకు తీసుకెళ్లి కారులో అనేకసార్లు అఘాయిత్యానికి ఒడిగడుతూ మానసికంగా వేధించాడు. కానీ ఎప్పటికీ వివాహం చేసుకోకపోవడం వల్ల బాధితురాలు మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు తన కుటుంబంతో బద్లాపుర్​లో గత ఐదు నెలలుగా నివసిస్తోంది. అయితే అంతకుముందు 2017లో అదే ప్రాంతంలో నివసించే మహేంద్ర అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఏడాదిలోపు ప్రేమగా మారింది. అయితే నిందితుడు.. ప్రేమను అవకాశంగా తీసుకుని బాధితురాల్ని శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె మహేంద్రతో మాట్లడడం మానేసింది. దాదాపు రెండేళ్ల పాటు వీరిద్దరు మాట్లాడుకోలేదు.

మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్​లో మహేంద్రతో బాధితురాలు మాట్లడడం మొదలుపెట్టింది. ఓ రోజు.. తన కారులో ఆమెను బయటకు తీసుకెళ్లి మార్గమధ్యలో మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలు భయపడి ఏడ్చింది. అయితే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు యువకుడు. కానీ వివాహం చేసుకోకుండా కాలయాపన చేశాడు. ఆ తర్వాత మే నుంచి సెప్టెంబరు వరకు పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడుతూ మానసికంగా వేధించాడు. ఆ తర్వాత ఆమె మొబైల్ నంబర్‌ను కూడా బ్లాక్ కూడా చేశాడు.

మహేంద్ర ప్రవర్తనతో మానసిక ఒత్తిడికి గురైన బాధితురాలు.. ఈ నెల 16వ తేదీన ఆన్​లైన్​లో విషపూరిత పదార్థాన్ని ఆర్డర్​ చేయగా 21వ తేదీన పార్శల్​ వచ్చింది. అప్పటి నుంచి ఆ పాయిజన్​ బాటిల్​ను హ్యాండ్​బ్యాగ్​లో పెట్టుకుని ఉంది బాధితురాలు. సెప్టెంబరు 24న మహేంద్ర.. బాధితురాల్ని మళ్లీ కారులో బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. వెంటనే తన హ్యాండ్​బ్యాగ్​లో ఉన్న విషాన్ని తీసుకుని తాగింది బాధితురాలు. దీంతో కారులోనే ఆమె వాంతులు చేసుకుంది. భయాందోళనకు గురైన మహేంద్ర వెంటనే ఆమెను ఇంటి దగ్గర దించాడు.

ఇంటికి వచ్చిన తర్వాత ఆమె పరిస్థితి మరింత విషమించింది. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

అమ్మాయితో వివాహిత లవ్​!
ఉత్తర్​ప్రదేశ్​లోని మథుర జిల్లాకు చెందిన ఓ వివాహిత.. మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటూ పట్టుబట్టింది. దీంతో ఇది తెలుసుకున్న ఆమె తల్లి, సోదరుడు ఒంటిపై కిరోసిన్​ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన పోలీసులు వారిని కాపాడారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. జిల్లాకు చెందిన వివాహితకు గోరఖ్​పుర్​లో ఉంటున్న ఓ అమ్మాయితో ఏడాదిన్నర క్రితం.. ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో మూడు నెలల క్రితం.. వివాహిత అత్తంటి నుంచి గోరఖ్​పుర్​ పారిపోయింది. అయితే నాలుగు రోజుల క్రితం ఆమె ఓ న్యాయవాదితో మథుర చేరుకుంది. తాను ఆ​ అమ్మాయిని వివాహం చేసుకుంటానని కుటుంబసభ్యులకు చెప్పింది.

అయితే ఈ మొత్తం వ్యవహారం పోలీస్​స్టేషన్​కు చేరింది. పోలీసులు ఎంత చెప్పినా వివాహిత వినిపించుకోకుండా.. తాను ప్రేమించిన​ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. అదే సమయంలో ఆమె తల్లి, సోదరుడు ఒంటిపై కిరోసిన్​ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన పోలీసులు వెంటనే వారిని కాపాడారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివాహిత కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు.

కుక్కల మర్మాంగాలపై పెట్రోల్​.. కేసు నమోదు..
మధ్యప్రదేశ్​లో ఇందోర్​లో వీధికుక్కల మర్మాంగాలపై పెట్రోల్​ పోసి పైశాచిక ఆనందం పొందిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. "జాయోరా కాంపౌండ్​ ప్రాంతంలో రోడ్డుపై సంచరిస్తున్న రెండు కుక్కలపై ఒక డెయిరీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు పెట్రోల్​ పోసినట్టు ఫిర్యాదు వచ్చింది. పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. నిందితుల కోసం గాలిస్తున్నాం" అని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: విడాకులు అడిగిందని నడిరోడ్డుపై హత్య.. ప్రేయసిపై కోపంతో విషం తాగి ఆత్మహత్య

బస్సు, ట్రక్కు ఢీ.. 8 మంది మృతి.. మరో 24 మంది పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.