హాస్టల్​ గదిలో ఉరేసుకుని LAW విద్యార్థిని ఆత్మహత్య

author img

By

Published : Dec 4, 2022, 3:14 PM IST

LLB student suicide at hostel room

ఉత్తర్​ప్రదేశ్​లో న్యాయవిద్య చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శనివారం హాస్టల్​ గదిలోనే ఉరివేసుకుని చనిపోయింది.

ఉత్తర్​ప్రదేశ్​లో విషాదకర ఘటన జరిగింది. న్యాయవిద్య చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం తాను ఉంటున్న హస్టల్​ గదిలోనే ఉరి వేసుకుని చనిపోయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప్‌గఢ్ జిల్లా జెత్వారా గ్రామానికి చెందిన కోమలి అనే విద్యార్థి లఖ్​నవూలోని ఎస్​ఎమ్​ఎన్​ఆర్ ​యూనివర్సిటీలో ఎల్ఎల్​బీ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె గత మూడేళ్లుగా స్నేహనగర్‌లోని సాహ్ని హాస్టల్‌లోనే ఉంటుంది. శుక్రవారం రాత్రి రూమ్​లోకి వెళ్లిన కోమలి.. ఉదయమైనా బయటకు రాలేదు. అనుమానం వచ్చిన స్నేహితురాళ్లు డోర్ కొట్టగా.. తీయలేదు. దీంతో ఆమె ఇంకా నిద్రలోనే ఉండొచ్చని భావించి వదిలేశారు. సాయంత్రం రూమ్​ శుభ్రం చేయడానికి వచ్చిన స్వీపర్..​ కోమలి రూమ్​ డోర్​ తట్టింది. అయినా ఆమె తలుపు తీయకపోవడం వల్ల పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కోమలి రూమ్ డోర్​ విరగకొట్టి లోపలికి వెళ్లగా కోమలి ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందిచారు పోలీసులు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని పోస్ట్​మార్టం పరీక్షల కోసం మృతదేహన్ని ఆస్పత్రికి తరలించారు. కోమలి ఆత్మహత్యకు సంబంధించి ఎటువంటి సూసైడ్​ నోట్​ లభించలేదని వారు తెలిపారు. ఈ మధ్య కోమలి తీవ్ర ఆందోళనకు గురైందని ఆమె తండ్రి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.