బైక్​కు దారి ఇవ్వలేదని.. కర్రలతో కొట్టి బస్సు డ్రైవర్​ దారుణ హత్య

author img

By

Published : May 10, 2022, 2:21 PM IST

Shocking: Murder of youth by beating him with batons for not giving way to two-wheeler

Pune Youth Murder: ద్విచక్రవాహనానికి దారి ఇవ్వలేదని ఓ వ్యక్తిని కొట్టిచంపారు దుండగులు. మహారాష్ట్ర పుణెలోని ఆంద్​గావ్​లో జరిగిందీ ఘటన. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Pune Youth Murder: మహారాష్ట్ర పుణెలో షాకింగ్​ ఘటన వెలుగుచూసింది. ద్విచక్రవాహనానికి దారి ఇవ్వలేదని ఓ వ్యక్తిని దారుణంగా కొట్టిచంపారు దుండగులు. కేసుకు సంబంధించి ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముల్శీ తాలుకా ఆంద్​గావ్​లో ఆదివారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మావల్ తాలుకా​ తుంగీ ప్రాంతానికి చెందిన సుభాష్​ విఠల్​ వాఘ్​మారే (38) ముంబయి అంధేరీలో ప్రైవేట్​ లగ్జరీ బస్సు డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. మే 6న తన అత్త చనిపోగా.. సుభాష్​ లోనావ్లాకు వచ్చాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం వారిని కలిసేందుకు దగ్గరి బంధువు రాజేశ్​ అంకుష్​ కుమార్​తో కలిసి ఆంద్​గావ్​కు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఉర్వడే- లవాసా రహదారి వద్ద రాజేంద్ర జగన్నాథ్​ మోహోల్ అనే వ్యక్తి.. సుభాష్​ బైక్​ను ఓవర్​టేక్​ చేసే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. కోపంతో ఊగిపోయిన రాజేంద్ర.. వేగంగా సుభాష్​ను ఛేజ్​ చేసి అతడి బైక్​ కీ లాక్కున్నాడు. ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. రాజేంద్ర మోహోల్​ తన ఇద్దరు స్నేహితులు సంగ్రామ్​ సురేశ్​ మోహోల్​, సమీర్​ దీపక్​ కర్పేకు ఫోన్​ చేసి రప్పించాడు. ముగ్గురు కలిసి ఆ వ్యక్తిపై దాడి చేశారు. కాళ్లతో తన్ని, కర్రలతో విరుచుకుపడగా.. సుభాష్​ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఇవీ చూడండి: 'షవర్మా'పై బ్యాన్​.. మేయర్​ ఆదేశాలు.. త్వరలో మరిన్ని నగరాల్లోనూ..!

బెడ్​షీట్​పై 'పీరియడ్స్'​ మరకలు.. హోటల్ యాజమాన్యం పనికి ప్రొఫెసర్​ షాక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.